Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Andhra Pradesh చిత్తూరు జిల్లాలో రైతులు ధర్నా

చిత్తూరు జిల్లాలో రైతులు ధర్నా

by Satya
Farmers dharna in Chittoor district

ఫ్యాక్టరీ వద్దు..మా పొలాలు మాకే కావాలంటూ చిత్తూరు జిల్లా పలమనేరు మండలం రెవెన్యూ డివిజనల్ కార్యాలయం వద్ద గోపిశెట్టిపల్లి రైతులు సుమారు 150 మంది ధర్నానిర్వహించారు. గ్రామస్తులు మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో తరచూ పేపర్లలో మా గోపిశెట్టి పల్లి గ్రామానికి చెందిన వందలాది ఎకరాల్లో ఫ్యాక్టరీని నిర్మిస్తున్నట్లు ప్రకటనలు వచ్చాయని, తమకు అధికారులు ఎవరు ఈ విషయమై అధికారికంగా ప్రస్తావన తీసుకురాలేదన్నారు. ఎన్నో దశాబ్దాలుగా తాత ముత్తాతల నుండి ఆ భూముల్లో సాగు చేసుకుంటున్నామని. భూములు వదులుకోవడానికి మేము సిద్ధంగా లేమన్నారు. అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా వెనుకాడబోమన్నారు..ఆర్డీవో అందుబాటులో లేకపోవడంతో రైతులు సిబ్బందికి వినతి పత్రం అందించారు.

Advertisements

You may also like

Our Visitor

026218
Total views : 150057

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.