హైకోర్టు సీజేగా ప్రమాణస్వీకారం చేయనున్న జస్టిస్ లీసా గిల్ ..

Advertisements

<p>ఏపీ న్యాయవ్యవస్థలో ఇవాళ ఓ కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది&period; ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు&period; జస్టిస్ లీసా గిల్‌ను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది&period; ప్రస్తుతం ఆమె పంజాబ్-హర్యానా హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా సేవలందిస్తూ నిష్పాక్షిక తీర్పులకు పేరుగాంచారు&period; అయితే&comma; ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తులు రిటైర్ అవ్వడానికి రెండు నెలల ముందే వారి వారసులను ఖరారు చేయాలని కొలీజియం నిర్ణయించింది&period; న్యాయపాలనలో జాప్యాన్ని నివారించేందుకు ఈ సరికొత్త విధానాన్ని అమలు చేస్తోంది&period; రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానానికి ఓ మహిళా న్యాయమూర్తి సారథ్యం వహించనుండటం పట్ల న్యాయ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది&period; రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న కీలక కేసులు&comma; న్యాయ పరిపాలన అంశాలపై ఆమె రాకతో వేగం పుంజుకోనుందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.