Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Andhra Pradesh మట్టి దొంగలను అరెస్ట్ చేయాలి..ఉమామహేశ్వర్ డిమాండ్

మట్టి దొంగలను అరెస్ట్ చేయాలి..ఉమామహేశ్వర్ డిమాండ్

by Prakash
devineni uma maheshwara rao

మట్టి దొంగలను అరెస్ట్ చేయాలి అని మైలవరం పోలీసుస్టేషన్ లో ఎస్.ఐ హరి ప్రసాద్ కి పిర్యాదు చేశారు. మండలంలోని పుల్లురు గ్రామంలో రూ.3 కోట్లు విలువైన నిలువ చేసిన మట్టిని తరలిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆయన అనుచరులు ఏ ఎం సి చైర్మన్ అప్పిడి సత్యనారాయణ రెడ్డిని అరెస్ట్ చేయాలి. పుల్లూరు గ్రామస్తులు మట్టి తోలకాలను అడ్డుకొని పోలీసులకు పట్టిస్తే కేసు నమోదు చేయకపోగా ఫిర్యాదు ఇస్తే విచారణ చేస్తామని పోలీసులు అనడం విడ్డూరంగా ఉందన్నారు. వైసిపి నాయకులకు పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చెరువు మట్టి ప్రజల అస్తి అలాంటి సంపదను వైసిపి నాయకులు దోచుకుంటున్నారు. వైసిపి నాయకులు మట్టి దోపిడీ రఘురాం రెడ్డి కి కనిపించటం లేదా అని ప్రశ్నించారు.
ఎంత వరకు చంద్రబాబు నాయుడు పై ఏ కేసులు పెడదాం అని చూస్తున్నారు అని విమర్శించారు. ఒక ఛాన్స్ పేరు తో ఎమ్మెల్యే అయ్యిన వసంత కృష్ణ ప్రసాద్ మట్టి దొంగలను, ఇసుక దొంగలను కాపాడుతున్నారని.., వైసీపీ పార్టీ కార్యాలయం లో ఉన్న అనుచరుల ద్వారా ఎమ్మెల్యే గంజాయి అమ్మిస్తున్నారని ఆరోపించారు. పేర్లు మార్చుకొని దుర్మార్గులు అంత మైలవరం ని చెర పట్టేందుకు గ్రామాల్లోకి వస్తున్నారని వీళ్ళందర్నీ తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Advertisements

You may also like

Our Visitor

026142
Total views : 149964

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.