కేంద్రంలో ఎన్డీయే కూటమి ఆధ్వర్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. 71 మంది సహచరులతో నరేంద్ర మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన మంత్రి కార్యాలయంలోకి అడుగుపెట్టిన మోదీ.. రైతుల సంక్షేమానికి తొలి ప్రాధాన్యమిచ్చారు. పీఎం కిసాన్ నిధుల విడుదలకు సంబంధించిన ఫైల్ పై తొలి సంతకం పెట్టారు. ముచ్చటగా మూడోసారి పీఎంవోలో అడుగుపెడుతున్న మోదీకి కార్యాలయ సిబ్బందితో పాటు పలువురు నేతలు ఘన స్వాగతం పలికారు. ఇరువైపులా నిల్చుని సంప్రదాయబద్ధంగా నమస్కరిస్తూ మోదీకి స్వాగతం చెప్పారు. సిబ్బంది అందరికీ నమస్కరిస్తూ మోదీ ప్రధానమంత్రి కార్యాలయంలోకి అడుగుపెట్టారు. తన సీటులో కూర్చున్న ప్రధాని మోదీ.. రైతులకు సంబంధించి పీఎం కిసాన్ నిధి 17వ విడత నిధులను విడుదల చేసేందుకు అనుమతిస్తూ ఫైల్ పై సంతకం పెట్టారు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న 9.3 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.20 వేల కోట్లు జమయ్యాయి.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- జగన్ ను భయపెడుతున్న రెడ్ బుక్ రహస్యాలుతాను ఇంకా రెడ్బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారని మంత్రి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. ఢిల్లీ వెళ్లి మరీ ఆయన రెడ్బుక్కు ప్రచారం కల్పిస్తున్నారని అన్నారు. అసెంబ్లీ లాబీలో లోకేశ్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఢిల్లీలో…
- ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేల్ ప్రభుత్వ బాలుర గురుకుల పాఠశాలలో జిల్లా కలెక్టర్ హనుమంతు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. విద్యార్థులు, సిబ్బందికి సంబంధించిన హాజరు రిజిస్టర్లను తనిఖీ చేశారు. కిచెన్, డైనింగ్ హాల్, స్టోర్…
- స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరికుప్పం పట్టణంలో ఎన్టీయార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు కుప్పంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి. అనంతరం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు . కుప్పంలో పేద విద్యార్థుల కోసం మంచి స్కూల్ తో పాటు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.