పశ్చిమబెంగాల్‌లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ..

Advertisements

<p>పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు&period; పోలీసుల అనుమతి నిరాకరణతో వాయిదా పడిన ఆయన సభలకు తాజాగా మార్గం సుగమమైంది&period; ఈ రోజు కోల్‌కతా&comma; సెరంపూర్‌లలో రాహుల్ గాంధీ బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు&period; ఈ నెల 23à°¨ కోల్‌కతా&comma; సెరంపూర్‌లలో రాహుల్ గాంధీ ర్యాలీలు జరగాల్సి ఉంది&period; అయితే&comma; చివరి నిమిషంలో పోలీసులు అనుమతి నిరాకరించడంతో అవి రద్దయ్యాయి&period; అధికార తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ ఒత్తిడి వల్లే తమ సభలకు అనుమతి ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది&period; ఈ పరిణామంతో ఇరు పార్టీల మధ్య ఉద్రిక్తత పెరిగింది&period;<&sol;p>&NewLine;<p>అయితే&comma; ఈ వివాదం సద్దుమణిగి అధికారులు అనుమతులు మంజూరు చేయడంతో ఇవాళ మళ్లీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు&period; మధ్యాహ్నం రెండున్నర గంటలకు కోల్‌కతాలోని చారిత్రక షహీద్ మినార్ మైదానంలో&comma; ఆ తర్వాత హుగ్లీ జిల్లాలోని సెరంపూర్‌లో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు&period; ఇటీవల తృణమూల్&comma; బీజేపీలపై రాహుల్ గాంధీ విమర్శల దాడి పెంచారు&period; మమతా బెనర్జీ స్వచ్ఛమైన పాలన అందించి&comma; బెంగాల్‌ను విభజించకుండా ఉండుంటే&comma; బీజేపీ ఇక్కడికి వచ్చేందుకు ఆస్కారమే ఉండేది కాదని రాహుల్ అన్నారు&period; రాష్ట్రంలో ఏప్రిల్ 23à°¨ తొలి విడత పోలింగ్ ముగియగా&comma; ఏప్రిల్ 29à°¨ రెండో విడత పోలింగ్ జరగనుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.