నగరి ఎమ్మెల్యే, మంత్రి ఆర్కే రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ… 175 నియోజకవర్గాలలో క్యాండెట్లు లేకుండా వైసిపి నుంచి ఎవరు బయటకు వస్తారా అని టిడిపి, జనసేన గోతి కాడ నక్కల వేచి చూస్తున్నారని ఆరోపించారు. ప్రతి రోజు గడప గడపకి వెళ్తూ.. పల్లె నిద్ర చేస్తూ.. పార్టీ కార్యక్రమాల్లో ముందు ఉన్నాను అన్నారు. పచ్చ మీడియా దిగజారుగు వార్తలు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. నగరిలో సీటు రోజాకు లేకుంటే.. రాధాకృష్ణ నిల్చుంటాడు.. రామోజీ రావు నిల్చుంటాడా అంటూ ఎద్దేవా చేశారు. మాలో మేము కొట్టుకొని సీటు ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది. ఆ అభ్యర్థులను టిడిపికి మళ్లించేద్దాం అని గోతికాడ గుంట నక్కల వ్యవహరిస్తున్నారని, జగన్ అన్న పై ప్రజల్లో ఎంత ప్రేమ ఉందో.. అంతకు మూడింతల్లు పార్టీలో మా అందరికి ఉందని, ప్రజల వద్ద జగన్ అన్నకు వ్యతిరేకత లేదని, జగన్ ముఖ్యమంత్రి అవ్వడానికి 100% పనిచేస్తాం అన్నారు. మళ్లీ మళ్లీ జగనన్నే ముఖ్యమంత్రి కావాలని దేవుడిని ప్రార్థించా అన్నారు. ప్రజలకు అందుబాటులో లేక సీటు లేకపోతే వేరొక పదవి ఇచ్చేలా సీఎం జగన్ చూస్తున్నారని,
చంద్రబాబు., పవన్ కళ్యాణ్ లు ఒక్క చోట నిలబడటానికి భయపడుతున్నారని అన్నారు. అందుబాటులో ఉన్నా కాబట్టే రెండు సార్లు ఎమ్మెల్యే, మంత్రులు అయ్యాం అని అన్నారు. 175కి 175 పక్కాగా గెలుస్తాం అని ధీమా వ్యక్తం చేసారు. నగరిలో ఎవరికి ఇచ్చిన నేను జగన్ అన్నకు ప్రాణం ఇస్తా అన్నారు. నాకు ఎమ్మెల్యే సీటు లేదు అనే ప్రచారం కేవలం శునకానందమే అని అన్నారు.
టిడిపిని జనసేనను తీవ్రస్థాయిలో విమర్శించిన ఆర్కే రోజా..
324
previous post






Total views : 201001