వైసిపి అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబు (Simhadri Ramesh Babu), మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర రావు గెలుపే దిశగా ఫ్రతిరోజు నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తు పైన ఓట్లు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని నియోజకవర్గ ప్రజలు స్వతహాగా ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఈరోజు అవనిగడ్డ వైసీపీ పార్టీ కార్యలయం నుంచి పలు గ్రామాల మీదుగా కోడూరు వరకు సింహాద్రి రమేష్ బాబు ఆధ్వర్యంలో రోడ్ షో నిర్వహించడంతో రహదారులు కిక్కిరిసిపోయాయి. వైసీపీకి మద్దతుగా వేలాదిగా వైసీపీ శ్రేణులు సింహాద్రి రమేష్ బాబు విజయం కోరుతూ ఉత్సాహంగా రోడ్ షో లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు కు దారి పొడవునా మహిళలు హారతులతో స్వాగతం పలికారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఈ సందర్భంగా అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు మాట్లాడుతూ… నేను విన్నాను నేను ఉన్నాను అంటూ ఇచ్చిన మాట ప్రకారం ప్రజలందరికీ సంక్షేమాన్ని అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. మళ్లీ రాష్ట్ర ప్రజలందరూ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. జూన్ 4 తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని అన్నారు. రేపు జరగబోయే ఎన్నికలలో నియోజకవర్గ ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అవనిగడ్డ శాసనసభ్యునిగా తనని మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ రావు గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీరితోపాటు అవనిగడ్డ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- జగన్ విమర్శలకు అమరావతి అభివృద్ధే సమాధానమిస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు…జగన్ విమర్శలకు అమరావతి అభివృద్ధే సమాధానమిస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. జగన్ మావిగన్ విమర్శలకు అమరావతి అభివృద్ధే సరైన సమాధానం ఇస్తుందన్నారు. అభివృద్ధి అనేది ఒకచోట ఆగేది కాదన్న చంద్రబాబు… హైదరాబాద్కు ఓఆర్ఆర్, ఎయిర్పోర్టు, ఐటీ రంగం ఆదాయాన్ని పెంచాయన్నారు. సైబరాబాద్…
- దీపం పథకం లబ్దిదారులు పైప్డ్ నేచురల్ గ్యాస్ కి మారినా కూడా వారికి ఇచ్చే…….దీపం పథకం లబ్దిదారులు పైప్డ్ నేచురల్ గ్యాస్ కి మారినా కూడా వారికి ఇచ్చే రాయితీ సొమ్మును వారి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఈ మేరకు సత్వరమే ఉత్తర్వులను…
- మన్యం జిల్లాలో గిరిజనల జీవన యాతన..మన్యం జిల్లాలో గిరిజనుల జీవన పరిస్థితులు ఇంకా మారలేదు. జియ్యమ్మవలస మండలం పరిధిలోని చాపరాయిగూడ, బాపన్నగూడ, దీసరిగూడ గ్రామాల ప్రజలు ఇప్పటికీ మౌలిక సదుపాయాల కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల వారు ఎదుర్కొంటున్న కష్టాలు వర్ణనాతీతంగా మారాయి.…




Total views : 33637