Saturday, September 12, 2026
News Navigation
Saturday, September 12, 2026
News Navigation

Breaking

Saturday, September 12, 2026
Home Andhra PradeshKrishana అవనిగడ్డలో సింహాద్రి రమేష్ బాబు రోడ్ షో..

అవనిగడ్డలో సింహాద్రి రమేష్ బాబు రోడ్ షో..

by Rama
Simhadri Ramesh Babu

వైసిపి అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబు (Simhadri Ramesh Babu), మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర రావు గెలుపే దిశగా ఫ్రతిరోజు నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తు పైన ఓట్లు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని నియోజకవర్గ ప్రజలు స్వతహాగా ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఈరోజు అవనిగడ్డ వైసీపీ పార్టీ కార్యలయం నుంచి పలు గ్రామాల మీదుగా కోడూరు వరకు సింహాద్రి రమేష్ బాబు ఆధ్వర్యంలో రోడ్ షో నిర్వహించడంతో రహదారులు కిక్కిరిసిపోయాయి. వైసీపీకి మద్దతుగా వేలాదిగా వైసీపీ శ్రేణులు సింహాద్రి రమేష్ బాబు విజయం కోరుతూ ఉత్సాహంగా రోడ్ షో లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు కు దారి పొడవునా మహిళలు హారతులతో స్వాగతం పలికారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News

ఈ సందర్భంగా అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు మాట్లాడుతూ… నేను విన్నాను నేను ఉన్నాను అంటూ ఇచ్చిన మాట ప్రకారం ప్రజలందరికీ సంక్షేమాన్ని అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. మళ్లీ రాష్ట్ర ప్రజలందరూ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. జూన్ 4 తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని అన్నారు. రేపు జరగబోయే ఎన్నికలలో నియోజకవర్గ ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అవనిగడ్డ శాసనసభ్యునిగా తనని మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ రావు గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీరితోపాటు అవనిగడ్డ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • ఏపీకి భారీ వర్షసూచన.. 9 జిల్లాలకు అలర్ట్.
    ఏపీలో వాతావరణశాఖ భారీ వర్షాలపై హెచ్చరికలు జారీ చేసింది. రెండు రోజులపాటు తొమ్మిది జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. విశాఖ, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో…
  • మెగా డీఎస్సీపై జగన్‌కు లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్.
    మెగా డీఎస్సీపై వైసీపీ అధినేత జగన్ చేస్తున్న ఆరోపణలకు మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి తేడా తెలియకుండా జగన్ మాట్లాడుతున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు తొలి సంతకం డీఎస్సీ…
  • త్వరలో పాదయాత్ర చేయబోతున్నట్లు వైసీపీ అధినేత జగన్ ప్రకటన.
    త్వరలో పాదయాత్ర చేయబోతున్నట్లు వైసీపీ అధినేత జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే టీడీపీ నేత రియాక్షన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు మంచితనాన్ని చూసి గతంలో జగన్ పాదయాత్ర చేశారని, కానీ ఇప్పుడు అలా కుదరని…
Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: