వైసిపి అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబు (Simhadri Ramesh Babu), మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర రావు గెలుపే దిశగా ఫ్రతిరోజు నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తు పైన ఓట్లు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని నియోజకవర్గ ప్రజలు స్వతహాగా ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఈరోజు అవనిగడ్డ వైసీపీ పార్టీ కార్యలయం నుంచి పలు గ్రామాల మీదుగా కోడూరు వరకు సింహాద్రి రమేష్ బాబు ఆధ్వర్యంలో రోడ్ షో నిర్వహించడంతో రహదారులు కిక్కిరిసిపోయాయి. వైసీపీకి మద్దతుగా వేలాదిగా వైసీపీ శ్రేణులు సింహాద్రి రమేష్ బాబు విజయం కోరుతూ ఉత్సాహంగా రోడ్ షో లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు కు దారి పొడవునా మహిళలు హారతులతో స్వాగతం పలికారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఈ సందర్భంగా అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు మాట్లాడుతూ… నేను విన్నాను నేను ఉన్నాను అంటూ ఇచ్చిన మాట ప్రకారం ప్రజలందరికీ సంక్షేమాన్ని అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. మళ్లీ రాష్ట్ర ప్రజలందరూ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. జూన్ 4 తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని అన్నారు. రేపు జరగబోయే ఎన్నికలలో నియోజకవర్గ ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అవనిగడ్డ శాసనసభ్యునిగా తనని మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ రావు గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీరితోపాటు అవనిగడ్డ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- స్టీల్ ప్లాంట్లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదంపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ప్రమాదానికి కారణమైన వారిగా భావిస్తున్న 15 మందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి… మరికొందరిని బదిలీ చేసింది. నాసిరకం మెటీరియల్ కొనుగోలు, పర్యావేక్షణ లోపం, ముందస్తు భద్రతా చర్యలు…
- ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వైసీపీ నాయకుడి నిర్వాకం.ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. చీమకుర్తి మండలం తొర్రగుడిపాడు గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు బత్తుల సుబ్బారావుపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. జిల్లాలోని సింగరాయకొండ, ఉలవపాడు ప్రాంతాలకు చెందిన నాలుగు గిరిజన కుటుంబాలను పనుల నిమిత్తం గ్రామానికి రప్పించిన…
- కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి.ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ‘రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం’ పేరుతో తిరుపతి సమీపంలోని దామినేడులో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ…




Total views : 141764