ఏపీలో ఐదేళ్ల పాటు ఓ వెలుగు వెలిగిన వైసీపీ నేతలు కనుమరుగైపోయారు. ఉన్న పదకొండు మంది ప్రజా ప్రతినిధుల ముఖంలో కళ తప్పింది. ఇన్నాళ్లూ కన్నూమిన్నూ కానకుండా.. ప్రవర్తించిన నాయకులంతా అండర్గ్రౌండ్కు వెళ్లిపోయారు. ఇక, ఊహించని ఘోర ఓటమిని జీర్ణించుకోలేక జగన్ అసహనానికి గురవుతున్నారు. ఈవీఎంలపై నెపం నెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఆ పార్టీ నాయకుడు రాపాక వరప్రసాద్ మాత్రం ట్యాంపరింగ్ అబద్ధమంటూ జగన్ వ్యాఖ్యలను కొట్టిపారేస్తున్నారు. జనం ఓటేయకపోతే ఈవీఎంలు ఏం చేస్తాయని రాపాక ప్రశ్నించారుమరోవైపు.. వైఎస్ జగన్ను నమ్మి నిండా మునిగామని ఆపార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు.. కొద్దిరోజుల్లో వైసీపీ ఖాళీ అవుతుందని సొంతపార్టీ సీనియర్ నేతలే చెబుతున్నారు. ఇక, అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం సమయంలో వైఎస్ జగన్ తడబడ్డారు. తన పేరునే పూర్తిగా చదవలేకపోయారు. ఇక, అసెంబ్లీలో తీవ్ర విచారవదనంలో వైఎస్ జగన్ కనిపించారుఅటు.. వైసీపీ ఎంపీ మిథున్రెడ్డి బీజేపీ వైపు చూస్తున్నారని చెబుతున్నారు. తన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా బీజేపీలోకి రమ్మని మిథున్రెడ్డి ఒత్తిడి తెస్తున్నారట. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పేల్చిన ఈ బాంబు వైసీపీ బాక్సు బద్దలు చేస్తోంది. జగన్కు బైబై చెప్పే ఆలోచనలో వైసీపీ ప్రజా ప్రతినిధులు ఉన్నారన్న వాదనకు బలం చేకూర్చింది. కొంతకాలానికి వైసీపీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు మిగిలే పరిస్థితి లేదని ఆ పార్టీ నేతలే అంటున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే వైసీపీ ఖాళీ అవడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్రెడ్డి.హైదరాబాద్ ఉప్పల్ భగాయత్లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన్కు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సేవలను సీఎం రేవంత్రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినా.. రోశయ్య మాత్రం తన ప్రత్యేకతను…
- ‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్కి థాంక్స్..‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్కి థాంక్స్.. యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్లో హీరో సూరి మంచి విజయాన్ని ఇచ్చిన ఆడియెన్స్కి థాంక్స్.. ‘మండాడి’ యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్లో హీరో సుహాస్ ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్…
- నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కీలక కార్యక్రమాలకు నడ్డా…
- మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.బ్రిక్స్ ఇండియా 2026 సదస్సు నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మధ్య కీలక ద్వైపాక్షిక భేటీ జరిగింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో భారత్–మలేషియా సంబంధాలకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.…
- ఏడేళ్ల తరువాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ భారత్ పర్యటనకు రానున్నారు. గాల్వాన్ వ్యాలీ ఘటన తర్వాత తొలిసారిగా భారత్కు వస్తున్న జిన్పింగ్ పర్యటనపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకోనున్న జిన్పింగ్తో పాటు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.