ఏపీలో ఐదేళ్ల పాటు ఓ వెలుగు వెలిగిన వైసీపీ నేతలు కనుమరుగైపోయారు. ఉన్న పదకొండు మంది ప్రజా ప్రతినిధుల ముఖంలో కళ తప్పింది. ఇన్నాళ్లూ కన్నూమిన్నూ కానకుండా.. ప్రవర్తించిన నాయకులంతా అండర్గ్రౌండ్కు వెళ్లిపోయారు. ఇక, ఊహించని ఘోర ఓటమిని జీర్ణించుకోలేక జగన్ అసహనానికి గురవుతున్నారు. ఈవీఎంలపై నెపం నెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఆ పార్టీ నాయకుడు రాపాక వరప్రసాద్ మాత్రం ట్యాంపరింగ్ అబద్ధమంటూ జగన్ వ్యాఖ్యలను కొట్టిపారేస్తున్నారు. జనం ఓటేయకపోతే ఈవీఎంలు ఏం చేస్తాయని రాపాక ప్రశ్నించారుమరోవైపు.. వైఎస్ జగన్ను నమ్మి నిండా మునిగామని ఆపార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు.. కొద్దిరోజుల్లో వైసీపీ ఖాళీ అవుతుందని సొంతపార్టీ సీనియర్ నేతలే చెబుతున్నారు. ఇక, అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం సమయంలో వైఎస్ జగన్ తడబడ్డారు. తన పేరునే పూర్తిగా చదవలేకపోయారు. ఇక, అసెంబ్లీలో తీవ్ర విచారవదనంలో వైఎస్ జగన్ కనిపించారుఅటు.. వైసీపీ ఎంపీ మిథున్రెడ్డి బీజేపీ వైపు చూస్తున్నారని చెబుతున్నారు. తన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా బీజేపీలోకి రమ్మని మిథున్రెడ్డి ఒత్తిడి తెస్తున్నారట. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పేల్చిన ఈ బాంబు వైసీపీ బాక్సు బద్దలు చేస్తోంది. జగన్కు బైబై చెప్పే ఆలోచనలో వైసీపీ ప్రజా ప్రతినిధులు ఉన్నారన్న వాదనకు బలం చేకూర్చింది. కొంతకాలానికి వైసీపీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు మిగిలే పరిస్థితి లేదని ఆ పార్టీ నేతలే అంటున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే వైసీపీ ఖాళీ అవడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- జమ్ము మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం..జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా పై హత్యాయత్నం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం సురీందర్ తో కలిసి ఓ పెళ్లి వేడుకకు వెళ్లారు మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా. ఈ సందర్భంగా ఫరూఖ్ అబ్దుల్లాకు భారీ భద్రత ఉంది.…
- ఆర్ అండ్ బీ అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష .రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధిని దీర్ఘకాలిక దృష్టితో ముందుకు తీసుకెళ్లాలని, 2047 విజన్ డాక్యుమెంట్కు అనుగుణంగా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. హైదరాబాద్ నగరం నుంచి రాష్ట్రంలోని ఏ ప్రాంతానికైనా నిర్ణీత సమయంలో చేరుకునేలా రోడ్ల అభివృద్ధి…
- ఫుడ్స్ పెట్టలేమంటూ హైదరాబాద్ ఐటీ కారిడార్ హాస్టల్ యాజమాన్యాలు సర్క్యులర్ జారీ చేశాయి.పశ్చిమాసియా యుద్ధ సెగ ఐటీ ఉద్యోగులకు తగిలింది. ఫుడ్స్ పెట్టలేమంటూ హైదరాబాద్ ఐటీ కారిడార్ హాస్టల్ యాజమాన్యాలు సర్క్యులర్ జారీ చేశాయి. ఎల్పీజీ గ్యాస్ కొరత కారణంగా హైదరాబాద్ హాస్టల్ యాజమాన్యాలు ఈ నిర్ణయం తీసుకున్నాయని తెలిపాయి. కేవలం ముఖ్యమైన ఆహార…
- పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, గల్ఫ్ దేశాల్లో ఉన్న లక్షలాది మంది భారతీయుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, గల్ఫ్ దేశాల్లో ఉన్న లక్షలాది మంది భారతీయుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భారత ప్రభుత్వం ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ పార్లమెంటులో వెల్లడించిన సమాచారం ప్రకారం,…
- సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరిగింది.సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సీఎం వారికి పలు అంశాలపై లక్ష్యాలను నిర్దేశించారు. సంక్షేమ, అభివృద్ధిపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాల పట్ల ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. అధికారులు-ప్రజాప్రతినిధుల…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.