హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) చేపట్టిన ఎన్నికల ప్రచారం రెండవ రోజు లేపాక్షి మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఫుల్ జోష్ నింపే విధంగా ప్రచారం కొనసాగింది. కొండూరు, కల్లూరు,నాయన పల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే బాలకృష్ణ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో టిడిపి, జనసేన, బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. బాలయ్య డప్పు కొట్టిన విధానం అక్కడ ఉన్న ప్రజలకి ఎంతో సంతోషాన్ని కలిగించింది. జై బాలయ్య జై బాలయ్య అంటూ పెద్ద ఎత్తున కేరింతల కొట్టారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ అంబేద్కర్ విదేశీ విద్యను జగన్ విదేశీ విద్యగా పేరు మార్చారన్నాడు. ఆంధ్ర రాష్ట్రంలో యువతను గంజాయికి, డ్రగ్స్ కి అలవాటు చేసి బ్రష్టు పట్టిస్తున్నారు. ప్రస్తుతం గడిచిన ఐదేళ్లలో వైసీపీ పాలనలో ఉన్న పరిశ్రమలన్నీ ఖాళీ చేసి రాష్ట్రాలకు వెళ్లిపోయాయన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే దళితులకు రెండు ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఇస్తామన్నారు. హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, ఎంపీ అభ్యర్థిగా బికే పార్థసారథిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. మీ ఓటు అనే వజ్రాయుధంతో సుపరిపాలన అందించే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలంటూ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సూచించారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరికుప్పం పట్టణంలో ఎన్టీయార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు కుప్పంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి. అనంతరం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు . కుప్పంలో పేద విద్యార్థుల కోసం మంచి స్కూల్ తో పాటు…
- రాజధాని అమరావతి పునర్నిర్మాణం పై సీఎం స్పెషల్ ఫోకస్ఏపీలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం రాజధాని అమరావతి పునర్నిర్మాణంపై దృష్టిపెట్టింది. సీఎం చంద్రబాబు అమరావతి అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించడం, ఎన్డీయే ప్రభుత్వం తాజా బడ్జెట్లో అమరావతి అభివృద్ధికి తోడ్పాటునందిస్తామని ప్రకటించిన నేపథ్యంలో లాండ్ పూలింగ్ మళ్లీ ప్రారంభమైంది.…
- నర్సులే.. డాక్టర్లు అయ్యారుభారతీయుడు-2 సినిమాలో మాదిరి ఫోన్ లో వీడియోలు చూసుకుంటూ నర్సులే వైద్యం చేస్తున్నారు. వైద్యులు లేకపోవడంతో బుచ్చిరెడ్డిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనర్సులే.. డాక్టర్లు అయ్యారు . ఫోన్ లో చూసుకుంటూ వైద్యం చేస్తున్నారు. వారం రోజుల్లో ఒక్కసారి కూడా…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి