హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) చేపట్టిన ఎన్నికల ప్రచారం రెండవ రోజు లేపాక్షి మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఫుల్ జోష్ నింపే విధంగా ప్రచారం కొనసాగింది. కొండూరు, కల్లూరు,నాయన పల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే బాలకృష్ణ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో టిడిపి, జనసేన, బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. బాలయ్య డప్పు కొట్టిన విధానం అక్కడ ఉన్న ప్రజలకి ఎంతో సంతోషాన్ని కలిగించింది. జై బాలయ్య జై బాలయ్య అంటూ పెద్ద ఎత్తున కేరింతల కొట్టారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ అంబేద్కర్ విదేశీ విద్యను జగన్ విదేశీ విద్యగా పేరు మార్చారన్నాడు. ఆంధ్ర రాష్ట్రంలో యువతను గంజాయికి, డ్రగ్స్ కి అలవాటు చేసి బ్రష్టు పట్టిస్తున్నారు. ప్రస్తుతం గడిచిన ఐదేళ్లలో వైసీపీ పాలనలో ఉన్న పరిశ్రమలన్నీ ఖాళీ చేసి రాష్ట్రాలకు వెళ్లిపోయాయన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే దళితులకు రెండు ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఇస్తామన్నారు. హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, ఎంపీ అభ్యర్థిగా బికే పార్థసారథిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. మీ ఓటు అనే వజ్రాయుధంతో సుపరిపాలన అందించే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలంటూ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సూచించారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరిగింది.సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సీఎం వారికి పలు అంశాలపై లక్ష్యాలను నిర్దేశించారు. సంక్షేమ, అభివృద్ధిపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాల పట్ల ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. అధికారులు-ప్రజాప్రతినిధుల…
- కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో కూటమి పార్టీల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి.కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో కూటమి పార్టీల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. కోడూరు మండల కేంద్రంలోని ఎస్పీ కాలనీలో రహదారి శంకుస్థాపన సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షుడు బండే శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వివాదం…
- తిరుపతి నగరంలోని ఎయిర్ బైపాస్ రోడ్లో ఉన్న డి మార్ట్ స్టోర్పై తక్షణ చర్యలుతిరుపతి నగరంలోని ఎయిర్ బైపాస్ రోడ్లో ఉన్న డి మార్ట్ స్టోర్పై తక్షణ చర్యలు తీసుకోవాలని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు, నేషనల్ షెడ్యూల్డ్ క్యాస్ట్ వెల్ఫేర్ కౌన్సిల్ సభ్యుడు మించల ప్రదీప్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు…