వైసీపీ మేనిఫెస్టోలో పాత హామీలు కొనసాగించటమంటే… అరాచకాలు కొనసాగుతాయని చెప్పటమేనని గుంటూరు లోక్ సభ తెదేపా అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandrasekhar) వ్యాఖ్యానించారు. ఈసారి జగన్ గెలిస్తే రాజధాని ఉండదు, పోలవరం ఉండదు, గంజాయి అమ్మాకాలు మాత్రం ఉంటాయని ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గుంటూరు పశ్ఛిమ నియోజకవర్గం అభ్యర్థి పిడుగురాళ్ల మాధవితో కలిసి అపార్ట్ మెంట్ వాసులతో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పెమ్మసాని జగన్ ను ఓడించటానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరమని… వైసీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలారి రోశయ్య చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఇంకా అమరావతిని ఒక వర్గానిదని ముద్ర వేసే ప్రయత్నాలను తిప్పికొట్టారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అమరావతిలో 8వ జిల్లా కలెక్టర్ల సమావేశం.అమరావతిలో జిల్లా కలెక్టర్ల 8వ సమావేశం జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, ప్రజలకు అందుతున్న సేవలపై కీలకంగా చర్చించారు. ఈగోలు పక్కనపెట్టి ప్రజల కోసం పనిచేయాలని కలెక్టర్లకు సీఎం పిలుపునిచ్చారు. సాధించిన అభివృద్ధిని…
- చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు.. లోకేశ్ నిరసన.తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు అరెస్టు జరిగి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిరసన తెలిపారు. ‘నిజం గెలిచింది’ అనే నినాదంతో ఉండవల్లిలోని తన నివాసంలో 53 కొవ్వొత్తులు వెలిగించి నాటి…
- సంక్షేమంపై మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదు: కొండపల్లి.సంక్షేమం గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదని రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమలు, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమన్నారు. ఎన్నికల హామీ మేరకు…