ఐపీఎల్-17(IPL-17)లో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals)కు ఎదురులేకుండా పోయింది. మైదానంలో అడుగుపెడితే విజయమే అన్నట్టుగా ఆ జట్టు దూకుడు కొనసాగుతోంది. లక్నో వేదికగా శనివారం జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ను 3 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన లక్నో 5 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్(76), దీపక్ హుడా(50) సత్తాచాటారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
అనంతరం లక్ష్యాన్ని రాజస్థాన్ అలవోకగా ఛేదించింది. 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. కెప్టెన్ శాంసన్(71 నాటౌట్), ధ్రువ్ జురెల్(52 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీలతో జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ సీజన్లో రాజస్థాన్ చేతిలో ఓడటం లక్నోకు ఇది రెండోసారి. రాజస్థాన్కు వరుసగా ఇది నాలుగో గెలుపు. మొత్తంగా 8వది. దీంతో ఆ జట్టు 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్ బెర్త్ను దాదాపు ఖరారు చేసుకుంది.
- భారత క్రికెటర్లకు నేడు మోదీ సన్మానంటీ20 ప్రపంచకప్ గెలుపుతో యావత్ దేశం గర్వపడేలా చేసిన టీమిండియా. అభిమానులకు మరో సర్ప్రైజ్ ఇచ్చింది. నేడు సాయంత్రం నిర్వహించనున్న విక్టరీ పరేడ్లో పాల్గొనాలంటూ అభిమానులను ఆహ్వానించింది. భారత క్రికెటర్లకు నేడు మోదీ సన్మానం చేయనున్నారు. అనంతరం టీం…
- లక్నో సూపర్ జెయింట్స్ ఘన విజయం..!లక్నో వేదికగా ముంబై ఇండియన్స్(Mumbai Indians) తో జరిగిన మ్యాచ్(Match)లో లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) సునాయాస విజయం సాధించింది. ముంబై నిర్దేశించిన 145 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 4 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. లక్నో…
- నాలుగో విజయంతో ముందుకు వెళుతున్న రాజస్థాన్..ఐపీఎల్-17(IPL-17)లో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals)కు ఎదురులేకుండా పోయింది. మైదానంలో అడుగుపెడితే విజయమే అన్నట్టుగా ఆ జట్టు దూకుడు కొనసాగుతోంది. లక్నో వేదికగా శనివారం జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ను 3 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. టాస్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.