Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home TelanganaMahabubnagar శ్రీ ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు..

శ్రీ ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు..

by Rama
Hanuman Temple

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం చిన్న రాజమూరు గ్రామంలో వెలసిన శ్రీ ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాలు ప్రధాన ఘట్టమైన స్వామివారి రథోత్సవం ఈ నెల 26వ తేది అర్ధరాత్రి జరగనున్నది. ఈ జాతరకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాతో పాటు ఆంధ్ర, కర్ణాటక నుంచి భక్తులు పెద్ద ఎత్తున తల్లి రావడం జరుగుతుంది. కావున స్వామివారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా దేవరకద్ర బస్టాండ్ నుండి ఆర్టిసి బస్సులను, దర్శనం కోసం క్యూలైన్లు, స్నానపు ఘట్టాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఆలయ ఈవో ప్రసాద్ తెలిజేశారు. రాజమూరు ఆంజనేయ స్వామిని ఇంటికి ఇలా వేల్పుగా భక్తులు భావిస్తారు. ఈ దేవాలయం కు 400 సంవత్సరాల చరిత్ర ఉంది. స్వామివారు చింతచెట్టు కింద ప్రత్యక్షంగా వెలిశారు. భక్తులు మనసులో కోరికలు అనుకొని ఈ చింత చెట్టుకు ముడుపులు కడితే తమ కోరికలు నెరవేరుతాయని భక్తులు భావిస్తారు. ఈ ఆలయానికి పైకప్పు లేకపోవడం ప్రత్యేకత.

Advertisements

You may also like

Our Visitor

025656
Total views : 147623

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.