Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

>
Friday, May 1, 2026
Home Devotional స్వామి వారి పాదుకలు దక్షిణాది నుంచి ఉత్తరాదికి..

స్వామి వారి పాదుకలు దక్షిణాది నుంచి ఉత్తరాదికి..

by Rama
sri ramuni padukulu

ప్రస్తుతం దేశవ్యాప్తంగా విదేశాలతో పాటు వినిపిస్తున్న మాట అయోధ్య రామాలయం. కనీవినీ ఎరిగిన రీతిలో వందల కోట్లతో అయోధ్య రామ మందిర నిర్మాణం జరుగుతోంది. ఈ రామాలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం కూడా పెట్టేసారు. ఇలాంటి నేపథ్యంలో అయోధ్య రాముని సేవకు అంకితమైన చల్లా శ్రీనివాస శాస్త్రి పాదయాత్రగా బయలుదేరి వెళుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కాకినాడ రూరల్ లోని శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానందని కలిచారు. వందల సంఖ్యలో భక్తులు వచ్చారు. శ్రీనివాస శాస్త్రి శ్రీరాముల వారి పాదుకలు తయారు చేయించారు. వాటితో పాదయాత్రగా వెళ్తున్నారు. గతంలో శ్రీరామచంద్రుడు ఉత్తరాది నుంచి దక్షిణాదికి వచ్చారు. ప్రస్తుతం ఆయన పాదుకలు దక్షిణాది నుంచి ఉత్తరాదికి వెళ్తున్నాయి అంటూ స్వామీజీ అభివర్ణించారు. పాదుకలకు ప్రత్యేక పూజలు చేసారు. ఆయన స్వహస్తాల మీదుగా పూజలు చేసి శ్రీనివాస శాస్త్రికి అందజేశారు. అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం జరిగింది.

Advertisements

You may also like

Our Visitor

009355
Total views : 61919

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.