అయోధ్య లో పూజిత అక్షింతల మహా శోభ యాత్ర శ్రీ రామ మందిర ప్రారంభోత్సవానికి అక్షింతలు పంపే కార్యక్రమంలో భాగంగా శ్రీరామ జన్మభూమి తీర్ద క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని పాలచెట్టు ఏరియా పంచముఖి ఆంజనేయ దేవాలయం నుండి మార్కెట్ సెంటర్ పురవిధుల్లో విశ్వహిందూ పరిషత్ నాయకులు, ఆత్మీయ హిందూ భాందవులు, భక్తులు పల్లకి సేవ శ్రీ వెంకటేశ్వర దేవాలయం వరకు పల్లకి సేవ భక్తులు మహిళలు నిర్వహించారు. మందమర్రి పట్టణ మున్షిపాలిటీ పురవీధుల గుండా పల్లకి సేవ నిర్వహించి, మహిళలు కోలాటాలు, నృత్యాలతో రామనామ స్మరణతో మారుమ్రోగింది. ప్రతీ గడప గడపకు రాముని చిత్ర పటం, అక్షింతలు చేరే విధంగా కార్యాచరణ రూపొందించామని విశ్వహింద్ పరిషత్ సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని హిందూ జాతిని సమాజానికి చాటి చెప్పాలని వారు పిలుపునిచ్చారు. ఈ పల్లకి సేవలో పెద్ద ఎత్తున భక్తులు మహిళలు పాల్గొన్నారు.
jai sri ram
చిక్కడపల్లి వివేక్ నగర్ లోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అయోధ్య రామ మందిరం అక్షింతలను ఇంటింటికీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కే లక్ష్మణ్ పంపిణీ చేశారు. హైదరాబాద్ చిక్కడపల్లి లోని వివేక్ నగర్ లోని హనుమాన్ దేవాలయంలో అయోధ్య నుంచి తీసుకొచ్చిన అక్షింతలకు పూజలు నిర్వహించి స్థానిక కార్పొరేటర్ పావని వినయ్ కుమార్ తో కలిసి డాక్టర్ కే లక్ష్మణ్ ఇంటింటికి అక్షింతలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 500 సంవత్సరాల తర్వాత రాముల వారి విగ్రహాన్ని పునః ప్రతిష్టాపన జరుగుతుందన్నారు. భవ్యమైన రామ మందిరంలో బాల రాముని విగ్రహ ప్రతిష్టాపన చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించతగ్గది అన్నారు. హిందువుల మనోభావాలను కాపాడడమే కాకుండా ప్రపంచం అయోధ్య వైపు చూస్తోందనీ, 22వ తేదీన విగ్రహా ప్రతిష్టాపన నేపథ్యంలో ప్రతి ఇంటి ముందు ఐదు దీపాలను వెలిగించాలనీ ఆయన సూచించారు. సనాతన ధర్మం గర్వపడేలా అందరూ తమ ఇళ్ల ముందు దీపాలు వెలిగించాలి. సనాతన ధర్మం ఏ విధంగా కాపాడుతుందో ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. నాడు తుర్కీషులు ఆలయాలను, మందిరాలను ధ్వంసం చేసి వినాశనాన్ని కోరుకుంటే వారే నాశనమయ్యారనీ అన్నారు.
Read Also..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా విదేశాలతో పాటు వినిపిస్తున్న మాట అయోధ్య రామాలయం. కనీవినీ ఎరిగిన రీతిలో వందల కోట్లతో అయోధ్య రామ మందిర నిర్మాణం జరుగుతోంది. ఈ రామాలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం కూడా పెట్టేసారు. ఇలాంటి నేపథ్యంలో అయోధ్య రాముని సేవకు అంకితమైన చల్లా శ్రీనివాస శాస్త్రి పాదయాత్రగా బయలుదేరి వెళుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కాకినాడ రూరల్ లోని శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానందని కలిచారు. వందల సంఖ్యలో భక్తులు వచ్చారు. శ్రీనివాస శాస్త్రి శ్రీరాముల వారి పాదుకలు తయారు చేయించారు. వాటితో పాదయాత్రగా వెళ్తున్నారు. గతంలో శ్రీరామచంద్రుడు ఉత్తరాది నుంచి దక్షిణాదికి వచ్చారు. ప్రస్తుతం ఆయన పాదుకలు దక్షిణాది నుంచి ఉత్తరాదికి వెళ్తున్నాయి అంటూ స్వామీజీ అభివర్ణించారు. పాదుకలకు ప్రత్యేక పూజలు చేసారు. ఆయన స్వహస్తాల మీదుగా పూజలు చేసి శ్రీనివాస శాస్త్రికి అందజేశారు. అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం జరిగింది.




Total views : 62064