అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈనెల మూడో తేదీన కలెక్టరేట్ ముట్టడికి సిఐటియు పిలుపునిచ్చింది. ముట్టడిని పురస్కరించుకొని సిపిఎం, సిఐటియు, అంగన్వాడీల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుకు నిరసనగా గురువారం సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీవో కార్యాలయం నుండి బోసుబొమ్మ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పివి ఆంజనేయులు మాట్లాడుతూ మహిళలని చూడకుండా పోలీసులు వ్యవహరించిన తీరు దుర్మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు, రైతు సంఘం, అంగన్వాడీలు, అంగన్వాడి హెల్పర్లు, కౌలు రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.
Tag:
సిపిఎం
కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి కేంద్రమైన తుగ్గలి లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు అఖిలపక్ష పార్టీ నాయకులు తాళాలు వేశారు.
ఈ ధర్నా కార్యక్రమంలో పత్తికొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి కే ఈ శ్యామ్ కుమార్ మాట్లాడుతూ ఈ వైసీపీ ప్రభుత్వం తుగ్గలి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించకపోతే ఈ ధర్నా కార్యక్రమం ఇక్కడితో ఆగదు అని అఖిలపక్ష పార్టీలతో కలిసి ఆర్డిఓ ఆఫీస్ కూడా తాళాలు వేస్తామన్నారు. అదే విధంగా కలెక్టర్ ఆఫీసు కూడా ముట్టడి చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, సిపిఎం, సిపిఐ, జనసేన, బిజెపి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.




Total views : 92018