ఛత్తీస్ఘడ్ లో మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీజాపూర్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మరియు CRPF DIG ముందు 25 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఈ మావోయిస్టులపై మొత్తం 29 లక్షల రూపాయల రివార్డు ఉన్నట్లు అధికారులు తెలిపారు. లొంగిపోయిన నక్సలైట్లు గంగ్లూర్ , బైరామ్గఢ్ ఏరియా కమిటీల్లో క్రియాశీలకంగా పని చేశారని జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు. ఇద్దరు మహిళా నక్సలైట్ లు కూడా లొంగిపోయినవారిలో ఉన్నారు. మావోయిస్టు భావజాలం పట్ల నిరాశ, ఉద్యమ నేతల దౌర్జన్యాల కారణంగా వీరు లొంగిపోయినట్లు ఎస్పీ చెప్పారు.ఛత్తీస్ ఘడ్ లో 25 మంది మావోయిస్టులు లొంగుబాటు. లొంగిపోయిన వీరికి రూ.25వేల చొప్పున సాయంతో పాటు ప్రభుత్వ పాలసీ ప్రకారం పునరావాసాన్ని కల్పిస్తామని ఎస్పీ తెలిపారు. బీజాపూర్ జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకూ 346 మంది నక్సలైట్ లను అరెస్టు చేయగా, 170 మంది లొంగిపోయారని ఆయన తెలిపారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.UK పర్యటనలో నిరాశపరిచిన తర్వాత భారత్ కోరుకున్న ఫలితం ఇదే. జింబాబ్వే గడ్డపై ఆ జట్టును పూర్తిగా అధిగమించి 3-0 తేడాతో క్లీన్ స్వీప్ పూర్తి చేసింది. వాస్తవానికి ఈ సిరీస్ అంతటా జింబాబ్వే జట్టు భారత్కు ఏమాత్రం పోటీనివ్వలేకపోయింది. భారత్…
- మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాగుటూరు పంచాయతీలోని రంగాపురం గ్రామానికి చెందిన 65 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో ఈ భారీ చేరికలు జరిగాయి.…
- రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య సంచలన ప్రకటన చేశారు. తాను 2028 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని, ఎన్నికల రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతున్నానని స్పష్టం చేశారు. అయితే, ప్రజా జీవితంలోనే కొనసాగుతూ ప్రజల పక్షాన తన గొంతు వినిపిస్తూనే ఉంటానని…
- నంద్యాల జిల్లాలో నలుగురు ఫారెస్ట్ అధికారుల సస్పెన్షన్.నంద్యాల జిల్లా ఆత్మకూరు వన్యప్రాణి అటవీ డివిజన్లో అధికారుల చేతివాటం తీవ్ర కలకలం రేపింది. స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న లక్షలాది రూపాయల విలువైన టేకు కలపను ప్రభుత్వ డిపోకు తరలించకుండా ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకునేందుకు ప్రయత్నించిన ఘటనా స్థానికంగా చర్చనీయాంశంగా…
- సీబీఎస్ఈ, నీట్ నిర్వహణలో కేంద్రం విఫలమైందని ఆరోపణ.సీబీఎస్ఈ, నీట్ వంటి కీలక జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలు, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ప్రతిపక్షం, ముఖ్యంగా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


