బీఆర్ఎస్ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పలువురు కీలక నేతలు పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే కొందరు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు నేతలు ముఖ్యమంత్రితో సమావేశం కాగా, తాజాగా ఆ జాబితాలో జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ రేవంత్ రెడ్డిని కలిశారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లిన ఆయన, సీఎం రేవంత్ రెడ్డికి శాలువా కప్పి సన్మానించారు. బొంతు రామ్మోహన్ కాంగ్రెస్ పార్టీలో త్వరలో చేరే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మల్కాజిగిరి ఎంపీ టికెట్ ఆశిస్తున్న రామ్మోహన్, ఇదే విషయమై రేవంత్ను కలిసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆయన బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు రాజకీయవర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరికొంత మంది జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు ఒకట్రెండురోజుల్లో సీఎం కలిసే అవకాశం ఉందని పీసీసీ వర్గాలు భావిస్తున్నాయి. Read Also..
Tag:
PCC
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం లోని శంకర్పల్లి చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్నర్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, వికారాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం ప్రసాద్, పరిగి కాంగ్రెస్ అభ్యర్థి రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఇంతకుముందు పార్టీ ఫిరాయించిన వ్యక్తులను అసెంబ్లీ ముందు పాత వెయ్యాల్సిందిగా జనాలను ఉద్దేశించి మాట్లాడారు. 25 వేల మెజార్టీతో కాంగ్రెస్ ను గెలిపించాలని రేవంత్ రెడ్డి కోరారు.





Total views : 78869