మరో నాలుగు రోజుల్లో ముగియనున్న రాయితీ..

Traffic chalana

Advertisements

&NewLine;<p>తెలంగాణలో పెండింగ్ ట్రాఫిక్ చలానా చెల్లింపునకు రాయితీ గడువు మరో నాలుగు రోజులు మాత్రమే ఉంది&period; ఈ నెల 10à°µ తేదీ వరకు రాయితీతో పెండింగ్ చలాన్లను చెల్లించవచ్చు&period; రాయితీ నేపథ్యంలో వాహనదారుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది&period; డిసెంబరు 26 నుంచి ఇప్పటి వరకు 76&period;79 లక్షల చలాన్లకు సంబంధించి రూ&period;66&period;77 కోట్ల చెల్లింపులు జరిగాయి&period; ద్విచక్ర వాహనాలు&comma; ఆటోలకు 80 శాతం&comma; ఫోర్ వీలర్లకు 60 శాతం&comma; ఆర్టీసీ బస్సులు&comma; తోపుడు బండ్లపై 90 శాతం&comma; భారీ వాహనాలపై 50 శాతం రాయితీని ప్రభుత్వం ప్రకటించింది&period; తెలంగాణ రాష్ట్రంలో 2 కోట్లకు పైగా చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి&period; దీంతో ఉన్నతాధికారులు రాయితీని ప్రకటిస్తూ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు&period; గత ఏడాది రాయితీ ప్రకటనతో 45 రోజుల్లోనే ఏకంగా రూ&period;300 కోట్ల ఆదాయం సమకూరింది&period; మీ సేవ&comma; పేటీఎం&comma; టీ వ్యాలెట్‌&comma; నెట్ బ్యాకింగ్ ద్వారా చెల్లింపులు జరపవచ్చు&period; అయితే&comma; ఫేక్ చలానా వెబ్ సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.