అమరావతి రాజధాని ప్రాంతంలో మరో అగ్ని ప్రమాదం.

Advertisements

<p>ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో మరో అగ్నిప్రమాదం జరిగింది&period; రాయపూడి సమీపంలో రాజధాని నిర్మాణ పనుల కోసం నిల్వ చేసిన పైపులకు నిప్పంటుకొని ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి&period; ప్రిన్సిపల్ సెక్రటరీస్ భవనాల వద్ద జరిగిన ఈ ప్రమాదంలో మేఘా కంపెనీకి చెందిన ప్లాస్టిక్ పైపులు అగ్నికి ఆహుతయ్యాయి&period; సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది&period;&period;వెంటనే అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశారు&period; దట్టమైన పొగతో మంటలు ఎగసిపడటంతో అదుపు చేయటం చాలా సేపటివరకు కష్టంగా మారింది&period; ఇదిలా ఉంటే&period;&period;కొద్దిరోజుల క్రితం వెలగపూడి సమీపంలో ఎల్‌అండ్‌టీకి చెందిన కోట్ల రూపాయల విలువైన పైపులు దగ్ధమయ్యాయి&period; ఆ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు&period; అది మరువక ముందే తాజాగా మరో ప్రమాదం జరిగింది&period; ఇలా వరుస ఘటనలతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి&period; అగ్నిప్రమాదాల వెనుక కుట్ర కోణముందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ.

టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.