ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యం

Assembly elections

Advertisements

&NewLine;<p>దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం విధిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది&period; నవంబర్ 7à°¨ ఉదయం ఏడు గంటల నుంచి నవంబర్ 30 సాయంత్రం ఆరున్నర గంటల వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుంది&period; ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఎగ్జిట్ పోల్స్ నిర్వహించడం&comma; ప్రచారం చేయడం&comma; ప్రచురించడం వంటివి చేయరాదని ఈసీ పేర్కొంది&period;<br>నిబంధనలు ఉల్లంఘించిన వారికి చట్ట ప్రకారం రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుందని ఎన్నికల సంఘం తెలిపింది&period; ఛత్తీస్‌గఢ్‌లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా&comma; నవంబర్ 7à°¨ తొలి దశ పోలింగ్&comma; నవంబర్ 17à°¨ రెండో దశ పోలింగ్ నిర్వహించనున్నారు&period; మిజోరాంలో నవంబర్ 7à°¨&comma; మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17à°¨&comma; రాజస్థాన్‌లో నవంబర్ 25à°¨&comma; తెలంగాణలో నవంబర్ 30à°¨ ఎన్నికలు జరగనున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.