Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Andhra Pradesh మహిళా సంఘాల ప్రతినిధుల సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌

మహిళా సంఘాల ప్రతినిధుల సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌

by Rama
మహిళా సంఘాల ప్రతినిధుల సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌

రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీలతో కూడిన ఎన్డీయే కూటమికి ఎన్నికల్లో అఖండ విజయం అందుకున్న వెంటనే కూటమిగా అభివృద్ధి పనుల్లో దిగామని, కలిసికట్టుగానే పనిచేస్తామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ ప్రకటించారు. మహిళా సంఘాల కమ్యూనిటీ ఆర్గనైజర్లు, ప్రతినిధులతో కల్సి సోమవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మీ ద్వారా ప్రభావితమైన డ్వాక్రా గ్రూపు మహిళలలో అత్యధిక శాతం ఎన్డీయే కూటమిని విశ్వసించి ఆదరించి ఓట్లు వేసి గెలిపించారని పేర్కొన్నారు. డ్వాక్రా గ్రూపులను చూసే మీ అందరినీ ఒక పార్టీకి ఆపాదించారని ఆయన పేర్కొంటూ నిజానికి రాజమండ్రి డ్వాక్రా గ్రూపులు తెలుగుదేశానికి కంచుకోట అనే విషయం వేరే చెప్పనవసరం లేదన్నారు. సంక్షేమ కార్యక్రమాలు వస్తాయని, ఇచ్చిన ప్రతిహమీ నెరవేర్చే ప్రయత్నం జరుగుతోందని ఆయన అన్నారు. ఎన్డీయే కూటమిగా రాజమండ్రిలో ఇచ్చిన హామీలు కూడా నెరవేరుస్తామని ఆయన స్పష్టంచేశారు. ఆరోగ్యకర రాజమండ్రి కార్యక్రమంలో భాగంగా అధ్వాన్నంగా ఉన్న పారిశుధ్యాన్ని ప్రక్షణాల చేశామన్నారు. గత మూడు కౌన్సిల్స్‌ లో సభ్యులుగా ఉన్న మాజీ కార్పొరేటర్లకు ఎంతో అవగాహన ఉందని, వారంతా బాధ్యతగా వ్యవహరించారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ చెప్పారు.మహిళా సంఘాల ప్రతినిధుల సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ వాల్వ్‌ కూడా తిరగకపోతే కొత్త గా వేశామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ వివరించారు. ఐదేళ్లుగా ఏమి జరిగిందో వెనక్కి తవ్వే ఆలోచన తమకు లేదని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ స్పష్టం చేస్తూ, అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేకున్నా సరే, జగన్మోహన్‌ రెడ్డి నిగౌరవించి లోపలకు పంపించామని గుర్తుచేసారు. ఇంతటి భారీ మెజార్టీలు ఇచ్చిన ప్రజల శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని అభివృద్ధివైపు దృష్టి పెట్టాలని, ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్న ఆలోచనతో ఉన్నామని ఆయన స్పష్టంచేసారు. వేఅయితే గతంలో జరిగిన తప్పులను మాత్రం తప్పులుగా చూపించాల్సిన అవసరం కూడా ఉందని ఆయన స్పష్టంచేశారు. తెల్సి తెల్సి కూడా తప్పులు చేసినపుడు ఎన్డీయే కూటమి సూచన మేరకు చర్యలు ఉంటాయని ఆయన అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, గతంలో మాదిరిగా నలుపు దుస్తులు, నలుపు మాస్క్‌ లు పెట్టుకున్నా కార్యక్రమానికి రానివ్వని పరిస్థితులు ఉండబోవని, అలాగే పరదాలు కట్టుకుని తిరిగే విధానం చంద్రభాబు నాయుడికి ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. మీ దగ్గరమే వచ్చి మీ సమస్యలు వింటారని, మీతో మమేకమవుతారని అన్నారు. వేధింపులు ఉండవని, మినహాయింపులు ఉండవని అన్నారు. శుభపరిణామంగా మంచి రోజులు వస్తున్నాయని అందరూ కలసికట్టుగా పనిచేయడం ప్రారంభించామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ చెప్పారు. హేవలాక్‌ బ్రిడ్జి గురించి, మల్టీపర్పస్‌ స్టేడియం మేచింగ్‌ గ్రాంట్‌ సంబంధించిన ఫైళ్లు పట్టుకుని ఎంపీ పురందేశ్వరి ఢల్లీి వెళ్లారని ఆయన అన్నారు. కాగా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యేగా అధిక మెజార్టీతో విజయం సాధించిన ఆదిరెడ్డి శ్రీనివాస్‌ను టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి యర్రా వేణు గోపాలరాయుడు శాలువాతో సత్కరించి పుష్ప గుచ్చెం అందచేసి అభినందించారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు, ఆర్పీలు, సీఓలు, మహిళ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS

  • హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.
    అమెరికాలో హెచ్-1బీ, పర్మ్ వర్క్ వీసాల జారీలో జరుగుతున్న అక్రమాలపై ట్రంప్ ప్రభుత్వం భారీ దర్యాప్తు చేపట్టింది. అమెరికా కార్మిక శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డి’ఎస్పోసిటో వెల్లడించిన వివరాల ప్రకారం.. వీసా మోసాలపై ఇప్పటికే డజన్ల కొద్దీ సమ్మన్లు, సబ్‌పోనాలు…
  • అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.
    ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక అడుగు పడుతోంది. ఇప్పటికే కేంద్ర కార్యాలయాలు, బ్యాంకులు, హోటల్స్, విద్యా సంస్థలతో రూపుదిద్దుకుంటున్న రాజధాని ప్రాంతానికి ఇప్పుడు హైటెక్ స్కై కనెక్టివిటీ కూడా అందుబాటులోకి రానుంది. ఉండవల్లి సమీపంలో ఆధునిక సదుపాయాలతో హెలిపోర్ట్…
  • భారత్-ఆస్ట్రేలియా సీఈఓలతో ప్రధాని మోదీ కీలక భేటీ.
    భారత్-ఆస్ట్రేలియా మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథనీ అల్బనీస్‌తో కలిసి ఇరు దేశాల ప్రముఖ సీఈఓలు, వ్యాపార దిగ్గజాలతో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల…
  • చెన్నై ఎగ్మూర్‌లోని ఆస్పత్రుల్లో సీఎం విజయ్‌ ఆకస్మిక తనిఖీలు.
    తమిళనాడు సీఎం విజయ్ పాలనలో తన మార్క్‌ చూపిస్తున్నారు. అవినీతి లేని పాలన అందిస్తానని చెబుతున్న విజయ్‌..ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఆధారాలతో సహా అవినీతి అధికారుల సమాచారం అందిస్తే వారిపై చర్యలు తీసుకుంటానని ప్రకటించిన ముఖ్యమంత్రి..తాజాగా ప్రభుత్వాస్పత్రుల్లో ఆకస్మిక…
  • ఇరాన్‌పై అమెరికా మళ్లీ క్షిపణి దాడులు.
    పశ్చిమాసియాలో కొంతకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఒక్కసారిగా తీవ్రస్థాయికి చేరాయి. అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో నౌకలను అడ్డుకుంటున్న ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఇరు దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం పూర్తిగా ‘ముగిసిపోయిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

039132
Total views : 194382

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: