Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home National సుఖ్‌దేవ్‌ హత్య కేసు.. నిందితుల అరెస్టు

సుఖ్‌దేవ్‌ హత్య కేసు.. నిందితుల అరెస్టు

by Satya
Arrest of the accused

రాష్ట్రీయ రాజ్‌పూత్‌ కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్‌ సింగ్‌ గోగామేడీ దారుణ హత్య కేసులో ఇద్దరు షూటర్లను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులతో పాటు వారి సహచరుడు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ, రాజస్థాన్‌ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు లో రోహిత్‌ రాఠోడ్‌, నితిన్‌ ఫౌజీ అనే ఇద్దరు షూటర్లను చండీగఢ్‌లో అరెస్టు చేశారు. వీరితో పాటు మరో వ్యక్తి ఉద్ధమ్‌ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. సుఖ్‌దేవ్‌ సింగ్‌ గోగామేడీ ఈ నెల 5న పట్టపగలు దారుణ హత్యకు గురయ్యారు. రాజస్థాన్‌ రాజధాని జైపుర్‌లోని శ్యామ్‌నగర్‌లో తన నివాసంలో ఉండగా దుండగులు కాల్పులు జరపడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై పోలీసులు ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టారు. నిందితుల గురించి సమాచారం అందించిన వారికి రూ. 5 లక్షల రివార్డును కూడా ప్రకటించారు. ఈ క్రమంలోనే పరారీలో ఉన్న నిందితులు తమ ఫోన్లు వినియోగిస్తుండడంతో వారున్న లొకేషన్‌ను గుర్తించారు. అక్కడికి చేరుకుని ఈ కేసులో కీలక నిందితులను అరెస్టు చేశారు.

Advertisements

You may also like

Our Visitor

014682
Total views : 80823

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.