Tuesday, April 28, 2026
News Navigation
Tuesday, April 28, 2026
News Navigation

Breaking

Tuesday, April 28, 2026
Home National రేపు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్న రేవంత్ రెడ్డి

రేపు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్న రేవంత్ రెడ్డి

by Satya
revanth reddy

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో రేపు మధ్యాహ్నం 3 గంటలకు జరగబోయే ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కాబోతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి దామోదర రాజనర్సింహ, రఘువీరారెడ్డి, పల్లంరాజు, కొప్పుల రాజు, వంశీచందర్ రెడ్డి, టి.సుబ్బరామిరెడ్డిలు పాల్గొననున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, అమలు చేయాల్సిన ఎన్నికల ప్రచార కార్యక్రమాలపై ఈ భేటీలో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ లో పార్టీ ఓటమిపై చర్చ, ఇండియా కూటమిలో సీట్ల పంపకాల విషయంలో పార్టీ వ్యూహం ఈ సందర్భంగా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read Also..

Read Also..

Advertisements

You may also like

Our Visitor

008613
Total views : 56952

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.