Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Andhra PradeshEast Godavari మనస్తాపంతో పార్టీ కి రాజీనామా..

మనస్తాపంతో పార్టీ కి రాజీనామా..

by Rama
Muddana Surya Prakash

తూర్పు గోదావరి (East Godavari):

కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో వైసీపీ నాయకులు ముద్దన సూర్య ప్రకాష్, ముద్దన శ్రీనివాస్, ముద్దన సత్యనారాయణ లు వారి నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముద్దన సూర్యప్రకాష్ మాట్లాడుతూ గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకులు అవినీతి మితిమిరి పోయిందనీ, ప్రతి చిన్న పనికి గ్రామస్తుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారని, గత 25 సంవత్సరాలుగా టీడీపీ పార్టీ లో కొనసాగిన 2019 తర్వాత గ్రామానికి చెందిన ఒక నాయకుడు వైసీపీలో రావాలని కోరగా వైసీపీలో చేరానని, తన కన్న ముందు నుండి తన సోదరులు ఇద్దరు వైసీపీలో ఉన్నారని అన్నారు.

Follow us on :Facebook, Instagram& YouTube.

ఎంపిటిసి, సర్పంచ్ ఎన్నికల్లో శక్తి వంచన లేకుండా పార్టీ కోసం కష్టపడి పార్టీ విజయం సాధించేలా కృషి చేశామని, తన సోదరుడు ప్రమాదంలో గాయపడితే కనీసం పలకరింపు కూడా చేయకుండా స్థానిక శాసనసభ్యులు ఉన్నారని ఆరోపించారు. పార్టీ కోసం ఎంతో కష్టపడి పని చేశామని, గ్రామంలో కొందరు నాయకులు అవినీతికి పాల్పడుతున్నారని కన్నబాబు దృష్టి కి తీసుకువెళ్లిన ఫలితం లేదని అందుకే మనస్తాపంతో పార్టీ కి రాజీనామా చేస్తున్నామని తెలిపారు. త్వరలో తన వర్గం నుండి సుమారు 300 మంది వైసీపీ పార్టీ కి రాజీనామా చేసి బయటకు వచ్చేస్తారని, రాన్నున ఎన్నికల్లో వైసీపీ కి వ్యతిరేకంగా పని చేయటమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. ఈ మీడియా సమావేశం లో కాకి సురేష్, పుల్ల సురేష్, ముద్దన సత్తిబాబు, కొప్పిసెట్టి బాబ్జీ, నక్కా అబ్బులు తదితరులు పాల్గొన్నారు. Read Also..

  • పోలవరం బ్యాక్ వాటర్‌తో బూర్గంపాడుకు భారీ ముంపు ముప్పు..
    గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు ప్రభావం ఇప్పుడు తెలంగాణ సరిహద్దు ప్రాంతాలపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా బూర్గంపాడు మండలం ప్రజలు ముంపు భయంతో వణికిపోతున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 45.72 మీటర్లు .నీటి నిల్వ…
  • బొబ్బిలి ఇందిరమ్మ కాలనీలో భూకబ్జాల కలకలం..
    విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ ఇప్పుడు భూకబ్జాల కేంద్రంగా మారిందన్న ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పేదల కోసం కేటాయించిన ఇళ్ల స్థలాలు బినామీ పేర్లతో కొంతమంది చేతుల్లోకి వెళ్లాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2016 నుంచి…
  • నెల్లూరు టీడీపీలో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు..
    నెల్లూరు టీడీపీలో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు ఏ రాజకీయ పార్టీకైనా అధిష్టానమే సుపీరియర్ .కానీ ఆ జిల్లా టిడిపిలో మాత్రం వేరే లెక్క . సిట్యుయేషన్ కి తగ్గట్టుగా ఎదుటివారి బలహీనతలను క్యాష్ చేసుకుంటూ వ్యూహరచన చేస్తూ… అధిష్టానానికి సుపిరియ‌ర్ అన్నట్లగా…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

014685
Total views : 80838

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.