Saturday, July 11, 2026
News Navigation
Saturday, July 11, 2026
News Navigation

Breaking

Saturday, July 11, 2026
Home Andhra PradeshEast Godavari మనస్తాపంతో పార్టీ కి రాజీనామా..

మనస్తాపంతో పార్టీ కి రాజీనామా..

by Rama
Muddana Surya Prakash

తూర్పు గోదావరి (East Godavari):

కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో వైసీపీ నాయకులు ముద్దన సూర్య ప్రకాష్, ముద్దన శ్రీనివాస్, ముద్దన సత్యనారాయణ లు వారి నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముద్దన సూర్యప్రకాష్ మాట్లాడుతూ గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకులు అవినీతి మితిమిరి పోయిందనీ, ప్రతి చిన్న పనికి గ్రామస్తుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారని, గత 25 సంవత్సరాలుగా టీడీపీ పార్టీ లో కొనసాగిన 2019 తర్వాత గ్రామానికి చెందిన ఒక నాయకుడు వైసీపీలో రావాలని కోరగా వైసీపీలో చేరానని, తన కన్న ముందు నుండి తన సోదరులు ఇద్దరు వైసీపీలో ఉన్నారని అన్నారు.

Follow us on :Facebook, Instagram& YouTube.

ఎంపిటిసి, సర్పంచ్ ఎన్నికల్లో శక్తి వంచన లేకుండా పార్టీ కోసం కష్టపడి పార్టీ విజయం సాధించేలా కృషి చేశామని, తన సోదరుడు ప్రమాదంలో గాయపడితే కనీసం పలకరింపు కూడా చేయకుండా స్థానిక శాసనసభ్యులు ఉన్నారని ఆరోపించారు. పార్టీ కోసం ఎంతో కష్టపడి పని చేశామని, గ్రామంలో కొందరు నాయకులు అవినీతికి పాల్పడుతున్నారని కన్నబాబు దృష్టి కి తీసుకువెళ్లిన ఫలితం లేదని అందుకే మనస్తాపంతో పార్టీ కి రాజీనామా చేస్తున్నామని తెలిపారు. త్వరలో తన వర్గం నుండి సుమారు 300 మంది వైసీపీ పార్టీ కి రాజీనామా చేసి బయటకు వచ్చేస్తారని, రాన్నున ఎన్నికల్లో వైసీపీ కి వ్యతిరేకంగా పని చేయటమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. ఈ మీడియా సమావేశం లో కాకి సురేష్, పుల్ల సురేష్, ముద్దన సత్తిబాబు, కొప్పిసెట్టి బాబ్జీ, నక్కా అబ్బులు తదితరులు పాల్గొన్నారు. Read Also..

  • సాయికృష్ణ కేసులో కీలక పరిణామం.
    సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు కస్టడీకి సంబంధించి ఏపీ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను సిట్ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈ మేరకు హైకోర్టు విధించిన నిబంధనలను సడలించాలని సిట్ కోరింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం, సీఐ నాగరాజును ఒక రోజు…
  • అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే.
    నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలం పెద్దిరెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ అంకాలమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అర్చకులు…
  • ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.
    ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ నేడు మరోసారి ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా రొటేటర్ కఫ్ గాయంతో బాధపడుతున్న ఆయన..భుజాలకు సంబంధించిన చికిత్స చేయించుకోనున్నారు. రెండు భుజాల కండరాలు దెబ్బతినడంతో ఇబ్బంది పడుతున్న పవన్‌ కల్యాణ్‌..ముంబై హాస్పిటల్‌లో ఇప్పటికే వైద్య పరీక్షలు…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

039689
Total views : 199213

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: