Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Telangana సీబీఐ కి ఎమ్మెల్సీ కవిత లేఖ..!

సీబీఐ కి ఎమ్మెల్సీ కవిత లేఖ..!

by Satya
Kavitha


బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ:

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వేస్టిగేషన్‌కి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇవాళ విచారణకు హాజరు కావడం లేదని ఆమె లేఖ ద్వారా సీబీఐకి తెలిపారు. ముందే నిర్ణయించిన కార్యక్రమాల దృష్ట్యా నేడు విచారణకు హాజరుకావడం సాధ్యం కావడంలేదన్నారు. 2022లో తనకు సెక్షన్ 160 కింద నోటీసులు ఇచ్చారని, కానీ ఆ నోటీసులకు ఇప్పడు సెక్షన్ 41ఏ కింద జారీ చేసిన నోటీసులకు చాలా వ్యత్యాసం ఉందని పేర్కొన్నారు.

బండి సంజయ్ రెండో విడత ప్రజాహిత యాత్ర…

ఎలాంటి పరిస్థితుల్లో నోటీసులు ఇచ్చారన్న దానిపై స్పష్టత లేదని కవిత తెలిపారు. బీఆర్ఎస్ తరఫున తాను ఎన్నికల్లో ప్రచారం చేయాల్సి ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ రావడం వల్ల అవరోధం కలుగుతుందన్నారు. అందుకే, 41ఏ నోటీసులను రద్దయినా చేయండి, లేదా వెనక్కి అయినా తీసుకోండి అని కవిత విజ్ఞప్తి చేశారు. ఒకవేళ సీబీఐ తన నుంచి ఏవైనా ప్రశ్నలకు సమాధానాలు కోరుకుంటే వర్చువల్ పద్దతిలో హాజరయ్యేందుకు తాను అందుబాటులో ఉంటానని కవిత స్పష్టం చేశారు.

Follow us on : Facebook, Instagram & YouTube.


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


దుబాయి ఎంబసీ అధికారులతో చొప్పదండి ఎమ్మెల్యే భేటీ.
దుబాయి ఎంబసి అధికారులతో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సమావేశం అయ్యారు. ఇటీవల దుబాయిలో జరిగిన …
నల్గొండ జిల్లా గుడిపల్లిలో ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన.
నల్గొండ జిల్లా గుడిపల్లిలో ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటించారు. 15 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న సమీకృత …
ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేనేత కార్మికుల దీక్ష విరమణ.
మంత్రి కొండా సురేఖ హామీ మేరకు నిరసన దీక్షను చేనేత కార్మి్కులు విరమించారు. ప్రభుత్వ శాఖలకు …

Advertisements

You may also like

Our Visitor

023140
Total views : 141165

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.