Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home Latest News బీసీ కులాల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది – మంత్రి పొన్నం

బీసీ కులాల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది – మంత్రి పొన్నం

by Prakash
Ponnam Prabhakar

పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) :

కులవృత్తులకు అధునాతన సాంకేతికతను జోడించి బీసీ కులాల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కంటోన్మెంట్ సిఖ్ విలేజ్ మడ్ ఫోర్డ్ దోభి ఘాట్ లో మోడ్రన్ మెకనైజ్డ్ లాండ్రీ యూనిట్ ను రవాణా, బిసి సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. దోబీ ఘాట్ లోని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులవృత్తులు మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా మారాలని మంత్రి పొన్నం పేర్కొన్నారు. ఎమ్మెల్యే, ఎంపి తో పాటు ప్రభుత్వ నిధులతో మోడ్రన్ మెకనైజ్డ్ లాండ్రీ యూనిట్ లను నియోజకవర్గానికి ఒకటి చొప్పున ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో కులవృత్తులను ప్రోత్సహించి ఉపాధి అవకాశాలను కల్పించి అధునాతన సాంకేతిక విధానాలతో ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. బీసీ జనగణన విషయంలో కూడా అసెంబ్లీలో నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. బీసీలంతా ఐక్యత ఉండి వారి హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


22ఏపై బీజేపీ దీక్షలు.
భూ భారతి పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ …
తెలంగాణలో ఆగస్టు 27న ఓటరు రోల్ సభలు.
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఈ నెల 27న …
భారత వ్యతిరేకి మమ్దానీతో రేవంత్‌ భేటీ ఎందుకు? కిషన్‌రెడ్డి.
సీఎం రేవంత్‌రెడ్డి లండన్ పర్యటనపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం స్థాయికి …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: