Follow us on : Facebook, Instagram, YouTube & Google News
శ్రీశైలం (Sri Sailam):
శ్రీశైలం (Sri Sailam)లో ఉగాది మహోత్సవాలను పురస్కరించుకొని ఐదురోజులపాటు జరిగిన ఉగాది మహోత్సవాల ఐదోవరోజైన ఈరోజు శ్రీస్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. శ్రీస్వామివారి యగశాలలో శ్రీచండిస్వారస్వామికి ప్రత్యేక పూజాదికాలు నిర్వహించి అనంతరం పూర్ణాహుతి కలశోద్వాసన, త్రిశూలస్నానం, జరిపారు. ఈ పూర్ణాహుతి కార్యక్రమంలో శాస్త్రోక్తంగా నారికేలాలు, పలు సుగంధ ద్రవ్యాలు, నూతన వస్త్రాలు మొదలైన ద్రవ్యాలను హోమగుండంలోకి ఆహుతిగా ఆలయ ఈవో పెద్దిరాజు దంపతులు, అర్చకులు సమర్పించి యాగపూర్ణాహుతి కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అనంతరం వసంతోత్సవం జరిపి వసంతోత్సవం తరువాత శ్రీచండీశ్వరస్వామిని పల్లకిలో ఆలయంలో ఊరేగింపుగా ఆలయంలోని మల్లికా గుండం వద్ద తోడ్కొని వచ్చి చండీశ్వరస్వామికి వైదిక శాస్త్రంగా అవభృధస్నానం దేవస్థానం ఈవో పెద్దిరాజు, అర్చకులు, వేదపండితులు నిర్వహించారు.
ఇది చదవండి: తొమ్మిదేళ్ళ పాలనలో బిఆర్ఎస్ చేసిందేమీలేదు..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 141124