ఎన్నికల(Election)కు మరో 19 రోజులే సమయం ఉందని, మన జీవితాలను మార్చుకునే తేదీ మే 13 అని చంద్రబాబు(Chandrababu) పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా(Srikakulam District) పాతపట్నంలో టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం సభ(Prajagalam Sabha) నిర్వహించారు. ఈ సభలో ఆయన ప్రసంగిస్తూ… పాతపట్నం ప్రజలు కొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యారని కొనియాడారు. ఈ సభకు విశేషంగా తరలివచ్చిన ప్రజలను, వారిలో కనిపిస్తున్న ఉత్సాహాన్ని చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందన్న నమ్మకం కలుగుతోందని పేర్కొన్నారు.
ఇది చదవండి: అట్టహాసంగా విరుపాక్షి నామినేషన్…
ఫైర్ బ్రాండ్, తండ్రి ఎర్రన్నాయుడికి తగ్గ తనయుడు కింజరాపు రామ్మోహన్ నాయుడును వరుసగా మూడోసారి కూడా పార్లమెంటుకు పంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఒక సామాన్య వ్యక్తి గోవిందరావుకు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన పార్టీ టీడీపీ అని స్పష్టం చేశారు. పేర్కొన్నారు. ఈ ఎన్నికలు తన కోసం కాదని, లేకపోతే తమ కూటమి పార్టీల కోసం కాదని… ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అని ఉద్ఘాటించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- ఒడిశా పూరి రథయాత్రలో సీఎం చంద్రబాబు.ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోనే కాదు, ఆధ్యాత్మిక రంగంలోనూ కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు.. ఒడిశాలోని పూరి జగన్నాథుని మహా రథయాత్రకు ఆయన హాజరుకావడం రాజకీయ, ఆధ్యాత్మిక వర్గాల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తోంది. భారతీయ సంస్కృతి విలువలను కాపాడడంలో…
- పవన్కల్యాణ్ను పరామర్శించిన ఏపీ గవర్నర్ నజీర్.ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పరామర్శించారు. ఇటీవల ముంబైలో పవన్ కుడి భుజానికి శస్త్ర చికిత్స చేసుకుని… తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. శస్త్ర చికిత్స అనంతరం పవన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి… గవర్నర్…
- నీట్ పేపర్ లీక్పై పోరాడుతున్న సోనమ్ వాంగ్చుక్.సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ ఢిల్లీలో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష 19వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయన ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన వైద్య చర్యలన్నీ తీసుకోవాలని ప్రభుత్వానికి…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి





Total views : 212402