శ్రీకాకుళం జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. పట్టణ ప్రాంతాలతో పాటు, గిరిజన ప్రాంతాల్లోని ప్రజలు మలేరియా, డెంగీ వంటి విష జ్వరాల బారిన పడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రిలో నిత్యం 500 వరకు ఉండే ఓపీ.. విష జ్వరాల బారిన పడిన రోగులతో 800 నుంచి 1000 వరకు చేరింది. సీజనల్ వ్యాధులు అధికంగా నమోదు అవుతుండటంతో శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రిలో మలేరియా, డెంగీ రోగుల కోసం ప్రత్యేక వార్డులను సిద్ధం చేశారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో విష జ్వరాల బారిన పడి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.ఇటీవల కురిసిన వర్షాలకు డ్రైనేజీల్లో నీరు చేరడంతో దోమలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో వ్యాధులు ప్రబలుతున్నాయి. శ్రీకాకుళం పట్టణంతో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో జనాన్ని జ్వరాలు పట్టి పీడిస్తున్నాయి. విజృంభిస్తున్న విష జ్వరాలు. దోమల కార్పొరేషన్, పంచాయతీలలో శానిటేషన్ పనులు అంతంత మాత్రంగానే జరుగుతున్నాయి.. పూర్తిస్థాయిలో శానిటేషన్ పనులు చేపట్టకపోవడంతో ప్రతి ఇంట్లోనూ ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు.
- నీట్ పేపర్ లీక్పై పోరాడుతున్న సోనమ్ వాంగ్చుక్.సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ ఢిల్లీలో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష 19వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయన ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన వైద్య చర్యలన్నీ తీసుకోవాలని ప్రభుత్వానికి…
- పాకిస్తాన్లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.పాకిస్థాన్లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బన్ను జిల్లాలో ఉన్న మిర్యాన్ పోలీస్ స్టేషన్పై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు.భారీ పేలుడుతో పోలీస్ స్టేషన్ పరిసరాలు ఒక్కసారిగా దద్దరిల్లిపోయాయి. ఈ ఘటనలో పలువురు పోలీసులు అక్కడికక్కడే మృతి చెందగా..డజన్ల సంఖ్యలో భద్రతా సిబ్బంది…
- విశాఖ సముద్రంలో ఫిషింగ్ బోటు బోల్తా.విశాఖపట్నంలో సముద్రం ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చడంతో పెను ప్రమాదం తప్పింది. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు బోల్తాపడగా… ఏడుగురు మత్స్యకారులు మృత్యువు అంచుల వరకు వెళ్లి ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, బోటు, వల పూర్తిగా…
- రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపల్ కార్యాలయం ఎదుట బీజేపీ ధర్నా.రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీజేపీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు.మున్సిపల్ ఎన్నికల సమయంలో ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే కేటీఆర్.. ప్రస్తుతం…
- డిసెంబర్ 3న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్ “ఫౌజీ”.ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎదురుచూస్తున్న మూవీ రెబల్ స్టార్ ప్రభాస్ “ఫౌజీ”. ఈ క్రేజీ మూవీ రిలీజ్ డేట్ ను ఈ రోజు మేకర్స్ అనౌన్స్ చేశారు. అజాతపర్వం ముగిసింది, ది రెబలియన్ ప్రారంభమైంది అంటూ డిసెంబర్ 3న ఫౌజీ సినిమాను…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Total views : 212335