శ్రీకాకుళం జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. పట్టణ ప్రాంతాలతో పాటు, గిరిజన ప్రాంతాల్లోని ప్రజలు మలేరియా, డెంగీ వంటి విష జ్వరాల బారిన పడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రిలో నిత్యం 500 వరకు ఉండే ఓపీ.. విష జ్వరాల బారిన పడిన రోగులతో 800 నుంచి 1000 వరకు చేరింది. సీజనల్ వ్యాధులు అధికంగా నమోదు అవుతుండటంతో శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రిలో మలేరియా, డెంగీ రోగుల కోసం ప్రత్యేక వార్డులను సిద్ధం చేశారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో విష జ్వరాల బారిన పడి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.ఇటీవల కురిసిన వర్షాలకు డ్రైనేజీల్లో నీరు చేరడంతో దోమలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో వ్యాధులు ప్రబలుతున్నాయి. శ్రీకాకుళం పట్టణంతో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో జనాన్ని జ్వరాలు పట్టి పీడిస్తున్నాయి. విజృంభిస్తున్న విష జ్వరాలు. దోమల కార్పొరేషన్, పంచాయతీలలో శానిటేషన్ పనులు అంతంత మాత్రంగానే జరుగుతున్నాయి.. పూర్తిస్థాయిలో శానిటేషన్ పనులు చేపట్టకపోవడంతో ప్రతి ఇంట్లోనూ ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు.
- అన్నమయ్య జిల్లాలో విషాదం…అన్నమయ్య జిల్లా పుంగనూరులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బైక్ నుంచి వచ్చే పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. పుంగనూరు త్యాగరాజు వీధిలో ఈ ఘటన జరిగింది. మృతిచెందిన వారిని తాత, మనవడు, ఇద్దరు మనవరాళ్లుగా గుర్తించారు.…
- నిర్భయ నిధి కింద ‘ములుగు’ జిల్లా ఎంపిక కావడం పట్ల మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు.నిర్భయ నిధి కింద ‘ములుగు’ జిల్లా ఎంపిక కావడం పట్ల మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీలో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణ దేవిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. నిర్భయ నిధి పథకం ద్వారా జిల్లాలో…
- అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు మంత్రి నారాయణ.అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు మంత్రి నారాయణ. పనులు ప్రారంభించిన 6 నెలల్లోనే సంబంధిత పనులు పూర్తి చేస్తామన్నారు. అనంతవరం, నెక్కలు గ్రామసభలకు మంత్రి హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, సీఆర్డీఏ అధికారులతో కలిసి…
- ప్రపంచవ్యాప్తంగా యుద్ధ ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో నార్త్ కొరియా ప్రయోగం కొత్త టెన్షన్కు దారితీసింది.ప్రపంచవ్యాప్తంగా యుద్ధ ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో నార్త్ కొరియా ప్రయోగం కొత్త టెన్షన్కు దారితీసింది. జపాన్ సముద్ర జలాల్లోకి నార్త్ కొరియా బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది. తమ దేశ సముద్ర జలాల్లోకి ఏకంగా 10 బాలిస్టిక్ క్షిపణులను ఉత్తర కొరియా ప్రయోగించినట్లు…
- రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో డ్రగ్స్ కలకలం.రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని అజీజ్నగర్లో కాల్పులు కలకలం సృష్టించాయి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్హౌస్లో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న డ్రగ్స్ పార్టీపై పోలీసులు మెరుపు దాడి చేశారు. ఫామ్హౌస్లో మద్యం, డ్రగ్స్ పార్టీ జరుగుతోందన్న పక్కా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి