ఎన్నికల(Election)కు మరో 19 రోజులే సమయం ఉందని, మన జీవితాలను మార్చుకునే తేదీ మే 13 అని చంద్రబాబు(Chandrababu) పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా(Srikakulam District) పాతపట్నంలో టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం సభ(Prajagalam Sabha) నిర్వహించారు. ఈ సభలో ఆయన ప్రసంగిస్తూ… పాతపట్నం ప్రజలు కొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యారని కొనియాడారు. ఈ సభకు విశేషంగా తరలివచ్చిన ప్రజలను, వారిలో కనిపిస్తున్న ఉత్సాహాన్ని చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందన్న నమ్మకం కలుగుతోందని పేర్కొన్నారు.
ఇది చదవండి: అట్టహాసంగా విరుపాక్షి నామినేషన్…
ఫైర్ బ్రాండ్, తండ్రి ఎర్రన్నాయుడికి తగ్గ తనయుడు కింజరాపు రామ్మోహన్ నాయుడును వరుసగా మూడోసారి కూడా పార్లమెంటుకు పంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఒక సామాన్య వ్యక్తి గోవిందరావుకు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన పార్టీ టీడీపీ అని స్పష్టం చేశారు. పేర్కొన్నారు. ఈ ఎన్నికలు తన కోసం కాదని, లేకపోతే తమ కూటమి పార్టీల కోసం కాదని… ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అని ఉద్ఘాటించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- నీట్ పేపర్ లీక్పై పోరాడుతున్న సోనమ్ వాంగ్చుక్.సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ ఢిల్లీలో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష 19వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయన ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన వైద్య చర్యలన్నీ తీసుకోవాలని ప్రభుత్వానికి…
- పాకిస్తాన్లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.పాకిస్థాన్లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బన్ను జిల్లాలో ఉన్న మిర్యాన్ పోలీస్ స్టేషన్పై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు.భారీ పేలుడుతో పోలీస్ స్టేషన్ పరిసరాలు ఒక్కసారిగా దద్దరిల్లిపోయాయి. ఈ ఘటనలో పలువురు పోలీసులు అక్కడికక్కడే మృతి చెందగా..డజన్ల సంఖ్యలో భద్రతా సిబ్బంది…
- విశాఖ సముద్రంలో ఫిషింగ్ బోటు బోల్తా.విశాఖపట్నంలో సముద్రం ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చడంతో పెను ప్రమాదం తప్పింది. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు బోల్తాపడగా… ఏడుగురు మత్స్యకారులు మృత్యువు అంచుల వరకు వెళ్లి ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, బోటు, వల పూర్తిగా…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి





Total views : 212302