ఎన్నికల(Election)కు మరో 19 రోజులే సమయం ఉందని, మన జీవితాలను మార్చుకునే తేదీ మే 13 అని చంద్రబాబు(Chandrababu) పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా(Srikakulam District) పాతపట్నంలో టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం సభ(Prajagalam Sabha) నిర్వహించారు. ఈ సభలో ఆయన ప్రసంగిస్తూ… పాతపట్నం ప్రజలు కొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యారని కొనియాడారు. ఈ సభకు విశేషంగా తరలివచ్చిన ప్రజలను, వారిలో కనిపిస్తున్న ఉత్సాహాన్ని చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందన్న నమ్మకం కలుగుతోందని పేర్కొన్నారు.
ఇది చదవండి: అట్టహాసంగా విరుపాక్షి నామినేషన్…
ఫైర్ బ్రాండ్, తండ్రి ఎర్రన్నాయుడికి తగ్గ తనయుడు కింజరాపు రామ్మోహన్ నాయుడును వరుసగా మూడోసారి కూడా పార్లమెంటుకు పంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఒక సామాన్య వ్యక్తి గోవిందరావుకు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన పార్టీ టీడీపీ అని స్పష్టం చేశారు. పేర్కొన్నారు. ఈ ఎన్నికలు తన కోసం కాదని, లేకపోతే తమ కూటమి పార్టీల కోసం కాదని… ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అని ఉద్ఘాటించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
- హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
- జనసేన అధినేత పవన్కల్యాణ్ సంచలన నిర్ణయం.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి





Total views : 90528