Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Telangana కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం సిద్ధం..

కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం సిద్ధం..

by Satya
KCR

బీఆర్ఎస్(BRS) అధినేత కేసీఆర్(KCR) బస్సు యాత్ర(Bus Yatra)కు సర్వం సిద్ధం చేశారు. రేపటి నుంచి మే 10వ తేదీ వరకు బస్సు యాత్ర కొనసాగనున్నది. 17 రోజుల పాటు 12 లోక్ సబ స్థానాల్లో రోడ్ షోలో కేసీఆర్ పాల్గొంటారు. కేసీఆర్ యాత్ర కొనసాగించనున్న బస్సుకు తెలంగాణ భవన్ లో గులాబీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పార్టీ అభ్యర్ధుల గెలుపే లక్ష్యంగా కేసీఆర్ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒకటి రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్ షోలు ఉండే విదంగా బస్సు యాత్రకు ప్లాన్ చేశారు.

ఇది చదవండి: అకాల వర్షాలతో నష్టపోతున్న రైతులు..!

రేపు ఉదయం తెలంగాణ భవన్ నుంచి బయల్దేరి మిర్యాలగూడ చేరుకొని.. అక్కడి నుంచి బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. మే 10వ తేదీన సిద్ధిపేటలో బస్సు యాత్ర ముగియనున్నది. బస్సు యాత్రలో రైతుల అంశం ప్రధాన అజెండాగా ఉండబోతుంది. ఎండిన పంట పొలాలను పరిశీలించడంతో పాటు సాగు నీరు, రైతులకు రైతు బంధు, పంటలకు బోన్ విషయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కేసీఆర్ అడిగి తెలుసుకుంటారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రధాన అస్త్రంగా చేసుకోబోతున్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News


  • పెద్దపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన..
    పెద్దపల్లి జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర మంత్రుల బృందం పరిశీలించింది. జిల్లాలో పండిన వరి పంట, కొనుగోలు పరిస్థితులపై అధికారులు, రైతులతో నేరుగా మాట్లాడి వివరాలు తెలుసుకుంది. కొనుగోళ్లలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రులు, అనంతరం…
  • తెలంగాణ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త..
    తెలంగాణ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణాల్లో ఇకపై ప్రతిసారి ఒరిజినల్ ఐడీ కార్డులు చూపించాల్సిన అవసరం లేకుండా “మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు” జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ…
  • జూన్ 2న అధికారికంగా ప్రారంభం కానున్న రైతు డిస్కం..
    తెలంగాణలో వ్యవసాయ రంగానికి ప్రత్యేకంగా సేవలందించేందుకు ఏర్పాటు చేసిన కొత్త “రైతు డిస్కం” జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అధికారికంగా ప్రారంభం కానుంది. పూర్తిస్థాయి సిబ్బందితో ఈ సంస్థ సేవలు ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. తాజాగా…

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి

Advertisements

You may also like

Our Visitor

018627
Total views : 89042

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.