మెదక్ జిల్లా(Medak District)లో అకాల వర్షంతో రైతులు(Farmers) నష్టపోతున్నారు. మరో వైపు వానరాల బెడదతో రైతులు తమ పంటను కాపాడుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఆరుగాలం కష్టపడిన పంట కళ్ళముందే వర్షార్పణం కావడంతో కన్నీరు, మున్నీరు అవుతున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట, చేగుంట నార్సింగి, నిజాంపేట మండలాల్లో కొన్ని గ్రామాల్లో కురిసిన వర్షానికి రైతులు ఆరబెట్టుకున్న ధాన్యం తడిసి ముద్దయింది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.
ఇది చదవండి: గొలుసు దొంగ ను వెంటాడి పట్టుకున్న స్థానికులు
వర్షానికి ధాన్యం తడవకుండా ఉండడానికి అవసరమైన కవర్లను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. రామాయంపేట మండల కేంద్రంలోని మార్కెట్ కేంద్రంలో రైతుల ధాన్యం తడిసి ముద్దయింది. మరోవైపు కోతుల బెడద తీవ్రంగా ఉంది. ధాన్యం కుప్పలపై ఎగబడి కోతులు ధాన్యాన్ని పాడు చేస్తున్నాయి. ఓవైపు కోతులు, మరోవైపు అకాల వర్షం రైతులను ఇబ్బంది పెడుతున్నాయి. వెంటనే ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- పెద్దపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన..పెద్దపల్లి జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర మంత్రుల బృందం పరిశీలించింది. జిల్లాలో పండిన వరి పంట, కొనుగోలు పరిస్థితులపై అధికారులు, రైతులతో నేరుగా మాట్లాడి వివరాలు తెలుసుకుంది. కొనుగోళ్లలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రులు, అనంతరం…
- తెలంగాణ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త..తెలంగాణ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణాల్లో ఇకపై ప్రతిసారి ఒరిజినల్ ఐడీ కార్డులు చూపించాల్సిన అవసరం లేకుండా “మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు” జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ…
- జూన్ 2న అధికారికంగా ప్రారంభం కానున్న రైతు డిస్కం..తెలంగాణలో వ్యవసాయ రంగానికి ప్రత్యేకంగా సేవలందించేందుకు ఏర్పాటు చేసిన కొత్త “రైతు డిస్కం” జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అధికారికంగా ప్రారంభం కానుంది. పూర్తిస్థాయి సిబ్బందితో ఈ సంస్థ సేవలు ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. తాజాగా…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి




Total views : 89114