శ్రీకాకుళం జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. పట్టణ ప్రాంతాలతో పాటు, గిరిజన ప్రాంతాల్లోని ప్రజలు మలేరియా, డెంగీ వంటి విష జ్వరాల బారిన పడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రిలో నిత్యం 500 వరకు ఉండే ఓపీ.. విష జ్వరాల బారిన పడిన రోగులతో 800 నుంచి 1000 వరకు చేరింది. సీజనల్ వ్యాధులు అధికంగా నమోదు అవుతుండటంతో శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రిలో మలేరియా, డెంగీ రోగుల కోసం ప్రత్యేక వార్డులను సిద్ధం చేశారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో విష జ్వరాల బారిన పడి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.ఇటీవల కురిసిన వర్షాలకు డ్రైనేజీల్లో నీరు చేరడంతో దోమలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో వ్యాధులు ప్రబలుతున్నాయి. శ్రీకాకుళం పట్టణంతో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో జనాన్ని జ్వరాలు పట్టి పీడిస్తున్నాయి. విజృంభిస్తున్న విష జ్వరాలు. దోమల కార్పొరేషన్, పంచాయతీలలో శానిటేషన్ పనులు అంతంత మాత్రంగానే జరుగుతున్నాయి.. పూర్తిస్థాయిలో శానిటేషన్ పనులు చేపట్టకపోవడంతో ప్రతి ఇంట్లోనూ ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు.
- చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ఆరోపణలు.అమెరికా ఎన్నికల వ్యవస్థలో చైనా భారీగా జోక్యం చేసుకుందని, ఏకంగా 22 కోట్ల మంది ఓటర్ల డేటాను దొంగిలించిందని సంచలన ఆరోపణలు చేశారు US ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. అమెరికా చరిత్రలోనే ఇది అతిపెద్ద ఎన్నికల డేటా చౌర్యం అని ఆరోపించారు.…
- అన్నమయ్య జిల్లాలో ఘనంగా విరుపాక్షమ్మ తల్లి పుష్కరోత్సవాలు.అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లిలోని శ్రీ విరుపాక్షమ్మ తల్లి ఆలయంలో పుష్కరోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ నిర్మాణానికి 12 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.మూడు…
- దేశంలో పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు.భారత రైల్వే చరిత్రలో నూతన శకం ఆరంభమైంది. రైల్వే రంగంలో పర్యావరణహిత విధానాలను ప్రవేశపెట్టే దిశగా కీలక ముందడుగు పడింది. దేశంలోనే తొలిసారిగా హైడ్రోజన్తో నడిచే రైలు పట్టాలెక్కింది. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు.…
- పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం.పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్లో విషాదం నెలకొంది. స్కూల్ బస్సును రైలు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఉదయం 7 గంటల ప్రాంతంలో ఓ స్కూల్ బస్సు కర్ణసుబర్ణ రైల్వే క్రాసింగ్ దగ్గర పట్టాలు దాటుతుండగా…
- ఇరాన్పై మరోసారి అమెరికా దాడులు.పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత ఉధృతమయ్యాయి. ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయ వంటి హర్మూజ్ జలసంధి కేంద్రంగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇరాన్లోని బ్రిడ్జిలు, రవాణా మార్గాలపై అమెరికా వైమానిక దాడులను మరింత తీవ్రతరం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 212606