శ్రీకాకుళం జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. పట్టణ ప్రాంతాలతో పాటు, గిరిజన ప్రాంతాల్లోని ప్రజలు మలేరియా, డెంగీ వంటి విష జ్వరాల బారిన పడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రిలో నిత్యం 500 వరకు ఉండే ఓపీ.. విష జ్వరాల బారిన పడిన రోగులతో 800 నుంచి 1000 వరకు చేరింది. సీజనల్ వ్యాధులు అధికంగా నమోదు అవుతుండటంతో శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రిలో మలేరియా, డెంగీ రోగుల కోసం ప్రత్యేక వార్డులను సిద్ధం చేశారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో విష జ్వరాల బారిన పడి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.ఇటీవల కురిసిన వర్షాలకు డ్రైనేజీల్లో నీరు చేరడంతో దోమలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో వ్యాధులు ప్రబలుతున్నాయి. శ్రీకాకుళం పట్టణంతో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో జనాన్ని జ్వరాలు పట్టి పీడిస్తున్నాయి. విజృంభిస్తున్న విష జ్వరాలు. దోమల కార్పొరేషన్, పంచాయతీలలో శానిటేషన్ పనులు అంతంత మాత్రంగానే జరుగుతున్నాయి.. పూర్తిస్థాయిలో శానిటేషన్ పనులు చేపట్టకపోవడంతో ప్రతి ఇంట్లోనూ ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు.
- ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
- హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
- జనసేన అధినేత పవన్కల్యాణ్ సంచలన నిర్ణయం.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
- అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
- శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి






Total views : 90711