ఓ పక్క ఎన్నికలు, మరో పక్క సమ్మర్ హాలిడేస్… ఇంకేముంది ట్రావెల్ ఏజెన్సీ వాళ్లు అమాంతంగా చార్జీలు పెంచేశారు. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లేవారి సంఖ్య భారీగా పెరిగింది. దీనితో విమాన చార్జీల ధరలకు రెక్కలొచ్చేశాయి. ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు డిమాండ్ ఎక్కువగా ఉంది. బస్సు చార్జీలు కూడా విమాన చార్జీలకు పోటీ పడటంతో విమాన సర్వీసుల టికెట్ ధరలు 20 నుంచి 30 శాతం పెరిగాయి. దండుకునేందుకు భారీగా ధరలు పెంచాయి. దీనితో విమాన చార్జీలు చుక్కలను అంటుకుంటున్నాయి. హైదరాబాద్ నుంచి సాధారణంగా రోజుకు సగటున 50వేల మంది విమానాల్లో ప్రయాణిస్తుంటారు. ప్రస్తుతం వారి సంఖ్య దాదాపు 60 వేలకు పెరిగింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇంకేముంది. దండుకునేందుకు విమానయాన సంస్థలు భారీగా ధరలు పెంచాయి. కొద్దిరోజులుగా నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలతో కొడైకెనాల్, కొచ్చి, ఊటీ, కేరళ, జైపుర్, ఢిల్లీ, అయోధ్య, శ్రీలంక, థాయిలాండ్, నేపాల్, మలేసియా తదితర ప్రాంతాలకు రద్దీ పెరిగింది. ఎన్నికల దృష్ట్యా ఢిల్లీతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్కు నేతల రాకపోకలు పెరిగాయి. ఫలితంగా పలు ఎయిర్లైన్స్ సంస్థలు ఛార్జీలు పెంచాయి. హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి సాధారణ రోజుల్లో సగటున టికెట్ ధర 4వేల 500 రూపాయలు ఉంటుంది. ఎన్నికలకు ముందు రోజు 12వ తేదీకి దాదాపు 50 శాతం పెరిగి 6వేల 500 రూపాయలకు చేరింది. అదే రోజున ఢిల్లీకి 6వేలుగా ఉంది. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి కొచ్చికి 5 వేల వరకు ఛార్జీ ఉంటుంది. ఈ నెల 12న 7 వేల రూపాయల వరకూ ఉంది. ఆఖరి నిమిషంలో రద్దీని బట్టి ఛార్జీల్లో మార్పులు ఉంటాయని ట్రావెల్ ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు.
- అల్లూరి జిల్లా దారకొండ, సీలేరు ప్రాంతంలో మలేరియా పాజిటివ్స్.అల్లూరి జిల్లాలో విష జ్వరాల విజృంభణ దారుణం సృష్టిస్తోంది. దారకొండ, సీలేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఒక్కరోజే ఏడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి . రోజుకి 40 నుంచి 50 మంది పేషెంట్లు ఓపి కింద వస్తున్నారు .కొంతమంది ఆస్పత్రిలో చేరుతున్నారు…
- విజయనగరం జిల్లా, గరివిడి మండలంలో భారీ భూ కుంభకోణం!విజయనగరం జిల్లా గరివిడి మండలంలో భారీ భూ కుంభకోణం జరిగిందన్న ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. వెదుళ్లవలస మాజీ సర్పంచ్ గుడివాడ తమ్మినాయుడు, అప్పటి తహశీల్దార్ బంగార్రాజు కుమ్మక్కై సుమారు 24 ఎకరాల ప్రభుత్వ భూమిని నకిలీ రికార్డుల ద్వారా వారి కుటుంబ…
- గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ‘నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్’గా మార్చిందన్న టీఎన్ఎస్ఎఫ్.గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ‘నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్’గా మార్చితే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ‘ఉద్యోగాల ఆంధ్రప్రదేశ్’గా తీర్చిదిద్దుతోందని టీఎన్ఎస్ఎఫ్ పేర్కొంది . విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో కూటమి విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో రౌండ్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




Total views : 92238