ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)కు ఓటర్లు తరలివెళ్తున్నారు. హైదరాబాద్(Hyderabad) నుంచి సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో, హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే రోడ్లన్నీ ఫుల్గా కనిపిస్తున్నాయి. సోమవారం ఏపీ అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు పోలింగ్ జరగనుంది. దీంతో, అక్కడ ఓటు హక్కు ఉన్న వాళ్లందరూ స్వస్థలాలకు బయలుదేరి వెళ్లారు. ఇంకా వెళ్తూనే ఉన్నారు. ఓటు వేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఫలితంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే హైవేపై వాహనాలు కిక్కిరిసిపోతున్నాయి.
పోలింగ్ తేదీకి ముందు వరుస సెలవులు రావడం కలిసొచ్చింది. వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రావడంతో ఓటు వేసేందుకు స్వస్థలాలకు వెళ్తున్నవాళ్లు.. కుటుంబసభ్యులతో సహా తరలివెళ్తున్నారు. శనివారం సెకండ్ సాటర్ డే, ఆదివారం, సోమవారం పోలింగ్ సెలవు వచ్చాయి. దీంతో, శుక్రవారం రాత్రి నుంచే రోడ్లమీద రద్దీ పెరిగింది.
కొందరు అభ్యర్థులు హైదరాబాద్లో స్థిరపడ్డ ఏపీ ఓటర్లను రప్పించేందుకు ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేశారు. ఇక, సొంత వాహనాలు ఉన్నవాళ్లు.. తమ వాహనాల్లోనే కుటుంబసమేతంగా స్వస్థలాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఫలితంగా రోడ్లమీద వాహనాల రద్దీ భారీగా పెరిగిపోయింది. ముఖ్యంగా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ వెళ్లడానికి అవకాశం ఉన్న అన్ని రోడ్లమీద ఇదే పరిస్థితి నెలకొంది. ఫలితంగా వాహనాలు హైవేలపై నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి.
ఇక, హైదరాబాద్ నుంచి విజయవాడ మధ్య ఉన్న టోల్ ప్లాజాలు కిక్కిరిసిపోతున్నాయి. శుక్రవారం రాత్రినుంచే టోల్ప్లాజాలన్నీ రద్దీగా మారాయి. టోల్ప్లాజాలు దాటేందుకు చాలా సమయం పడుతోంది. ప్రధానంగా చౌటుప్పల్, పంతంగి, చిల్లకల్లు, కీసర టోల్ప్లాజాల దగ్గర వాహనాల రద్దీ పెరిగిపోయింది. దీంతో, వాహనాల రద్దీకి అనుగుణంగా ఆయా టోల్ప్లాజాల్లో కౌంటర్లను కూడా పెంచేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- నంద్యాల జిల్లా ఆత్మకూరులో పులి, పులికూనలు హల్చల్.నంద్యాల జిల్లా, ఆత్మకూరు అటవీ డివిజన్లో నాలుగు పులి కూనలు హల్చల్ చేశాయి. నల్లకాల్వ గ్రామానికి చెందిన కొందరు కూలీలు శ్రీశైలం కుడిగట్టు ప్రధాన విద్యుత్ టవర్ కింద పొదలు శుభ్రం చేసే పనికి వెళ్లారు. వెలుగోడు అటవీ రేంజ్ పరిధిలోని…
- అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఎమ్మెల్యే సమీక్ష.అనంతపురం నగర ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, వైద్య సేవల మెరుగుదలపై కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. స్వచ్చాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్తో కలిసి అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆసుపత్రిని సందర్శించి సూపరింటెండెంట్, వైద్యులు, సిబ్బందితో సమావేశమయ్యారు. రోగులకు అందుతున్న వైద్య…
- కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం.రాష్ట్రంలో నమోదవుతున్న కోవిడ్ కేసుల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు పరీక్షల కిట్లు, మందులు, ప్రత్యేక పడకలు, రక్షణ సామగ్రి, అత్యవసర ఔషధాలను అందుబాటులో ఉంచేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. ఈ మేరకు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 223730