Wednesday, July 22, 2026
News Navigation
Wednesday, July 22, 2026
News Navigation

Breaking

Wednesday, July 22, 2026
Home Andhra Pradesh ఎన్నికల వేళ పెరిగిన టికెట్‌ ధరలు..!

ఎన్నికల వేళ పెరిగిన టికెట్‌ ధరలు..!

by Satya
Ticket prices increased during elections

ఓ పక్క ఎన్నికలు, మరో పక్క సమ్మర్ హాలిడేస్… ఇంకేముంది ట్రావెల్ ఏజెన్సీ వాళ్లు అమాంతంగా చార్జీలు పెంచేశారు. హైదరాబాద్‌ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లేవారి సంఖ్య భారీగా పెరిగింది. దీనితో విమాన చార్జీల ధరలకు రెక్కలొచ్చేశాయి. ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు డిమాండ్‌ ఎక్కువగా ఉంది. బస్సు చార్జీలు కూడా విమాన చార్జీలకు పోటీ పడటంతో విమాన సర్వీసుల టికెట్‌ ధరలు 20 నుంచి 30 శాతం పెరిగాయి. దండుకునేందుకు భారీగా ధరలు పెంచాయి. దీనితో విమాన చార్జీలు చుక్కలను అంటుకుంటున్నాయి. హైదరాబాద్‌ నుంచి సాధారణంగా రోజుకు సగటున 50వేల మంది విమానాల్లో ప్రయాణిస్తుంటారు. ప్రస్తుతం వారి సంఖ్య దాదాపు 60 వేలకు పెరిగింది.

Follow us on : FacebookInstagramYouTube & Google News

ఇంకేముంది. దండుకునేందుకు విమానయాన సంస్థలు భారీగా ధరలు పెంచాయి. కొద్దిరోజులుగా నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలతో కొడైకెనాల్‌, కొచ్చి, ఊటీ, కేరళ, జైపుర్‌, ఢిల్లీ, అయోధ్య, శ్రీలంక, థాయిలాండ్‌, నేపాల్‌, మలేసియా తదితర ప్రాంతాలకు రద్దీ పెరిగింది. ఎన్నికల దృష్ట్యా ఢిల్లీతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు నేతల రాకపోకలు పెరిగాయి. ఫలితంగా పలు ఎయిర్‌లైన్స్‌ సంస్థలు ఛార్జీలు పెంచాయి. హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నానికి సాధారణ రోజుల్లో సగటున టికెట్‌ ధర 4వేల 500 రూపాయలు ఉంటుంది. ఎన్నికలకు ముందు రోజు 12వ తేదీకి దాదాపు 50 శాతం పెరిగి 6వేల 500 రూపాయలకు చేరింది. అదే రోజున ఢిల్లీకి 6వేలుగా ఉంది. సాధారణ రోజుల్లో హైదరాబాద్‌ నుంచి కొచ్చికి 5 వేల వరకు ఛార్జీ ఉంటుంది. ఈ నెల 12న 7 వేల రూపాయల వరకూ ఉంది. ఆఖరి నిమిషంలో రద్దీని బట్టి ఛార్జీల్లో మార్పులు ఉంటాయని ట్రావెల్‌ ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు.


  • నంద్యాల జిల్లా ఆత్మకూరులో పులి, పులికూనలు హల్చల్.
    నంద్యాల జిల్లా, ఆత్మకూరు అటవీ డివిజన్‌లో నాలుగు పులి కూనలు హల్‌చల్ చేశాయి. నల్లకాల్వ గ్రామానికి చెందిన కొందరు కూలీలు శ్రీశైలం కుడిగట్టు ప్రధాన విద్యుత్ టవర్ కింద పొదలు శుభ్రం చేసే పనికి వెళ్లారు. వెలుగోడు అటవీ రేంజ్ పరిధిలోని…
  • అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఎమ్మెల్యే సమీక్ష.
    అనంతపురం నగర ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, వైద్య సేవల మెరుగుదలపై కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. స్వచ్చాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్‌తో కలిసి అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆసుపత్రిని సందర్శించి సూపరింటెండెంట్, వైద్యులు, సిబ్బందితో సమావేశమయ్యారు. రోగులకు అందుతున్న వైద్య…
  • కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం.
    రాష్ట్రంలో నమోదవుతున్న కోవిడ్ కేసుల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు పరీక్షల కిట్లు, మందులు, ప్రత్యేక పడకలు, రక్షణ సామగ్రి, అత్యవసర ఔషధాలను అందుబాటులో ఉంచేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. ఈ మేరకు…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Our Visitor

042280
Total views : 223735

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: