Thursday, June 4, 2026
News Navigation
Thursday, June 4, 2026
News Navigation

Breaking

Thursday, June 4, 2026
Home Andhra Pradesh ఎన్నికల వేళ పెరిగిన టికెట్‌ ధరలు..!

ఎన్నికల వేళ పెరిగిన టికెట్‌ ధరలు..!

by Satya
Ticket prices increased during elections

ఓ పక్క ఎన్నికలు, మరో పక్క సమ్మర్ హాలిడేస్… ఇంకేముంది ట్రావెల్ ఏజెన్సీ వాళ్లు అమాంతంగా చార్జీలు పెంచేశారు. హైదరాబాద్‌ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లేవారి సంఖ్య భారీగా పెరిగింది. దీనితో విమాన చార్జీల ధరలకు రెక్కలొచ్చేశాయి. ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు డిమాండ్‌ ఎక్కువగా ఉంది. బస్సు చార్జీలు కూడా విమాన చార్జీలకు పోటీ పడటంతో విమాన సర్వీసుల టికెట్‌ ధరలు 20 నుంచి 30 శాతం పెరిగాయి. దండుకునేందుకు భారీగా ధరలు పెంచాయి. దీనితో విమాన చార్జీలు చుక్కలను అంటుకుంటున్నాయి. హైదరాబాద్‌ నుంచి సాధారణంగా రోజుకు సగటున 50వేల మంది విమానాల్లో ప్రయాణిస్తుంటారు. ప్రస్తుతం వారి సంఖ్య దాదాపు 60 వేలకు పెరిగింది.

Follow us on : FacebookInstagramYouTube & Google News

ఇంకేముంది. దండుకునేందుకు విమానయాన సంస్థలు భారీగా ధరలు పెంచాయి. కొద్దిరోజులుగా నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలతో కొడైకెనాల్‌, కొచ్చి, ఊటీ, కేరళ, జైపుర్‌, ఢిల్లీ, అయోధ్య, శ్రీలంక, థాయిలాండ్‌, నేపాల్‌, మలేసియా తదితర ప్రాంతాలకు రద్దీ పెరిగింది. ఎన్నికల దృష్ట్యా ఢిల్లీతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు నేతల రాకపోకలు పెరిగాయి. ఫలితంగా పలు ఎయిర్‌లైన్స్‌ సంస్థలు ఛార్జీలు పెంచాయి. హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నానికి సాధారణ రోజుల్లో సగటున టికెట్‌ ధర 4వేల 500 రూపాయలు ఉంటుంది. ఎన్నికలకు ముందు రోజు 12వ తేదీకి దాదాపు 50 శాతం పెరిగి 6వేల 500 రూపాయలకు చేరింది. అదే రోజున ఢిల్లీకి 6వేలుగా ఉంది. సాధారణ రోజుల్లో హైదరాబాద్‌ నుంచి కొచ్చికి 5 వేల వరకు ఛార్జీ ఉంటుంది. ఈ నెల 12న 7 వేల రూపాయల వరకూ ఉంది. ఆఖరి నిమిషంలో రద్దీని బట్టి ఛార్జీల్లో మార్పులు ఉంటాయని ట్రావెల్‌ ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు.


  • మంత్రి నారాయణతో భేటీ అయిన సీఆర్‌ఆర్‌ఐ ప్రతినిధులు.
    మంత్రి నారాయణతో సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌ ప్రతినిధులు భేటీ అయ్యారు. అమరావతిలో ఎల్పీఎస్ జోన్లు నిర్మిస్తున్న సీఆర్‌ఆర్‌ఐ రోడ్లను స్టడీ చేస్తున్నారు. రెండ్రోజులపాటు జోన్ల‌లో ఇంటర్నల్ రోడ్లు, డ్రెయిన్లు, ప‌వ‌ర్ లైన్లు అధ్యయనం చేశారు. ఎల్​పీఎస్ జోన్‌-2, 5, 9,…
  • మాజీ సీఎం జగన్ పై హోం మంత్రి అనిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
    మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఏ ఆత్మ చెప్తే.. జగన్ 9 నెలల తర్వాత విషప్రచారం మొదలుపెట్టారంటూ వ్యాఖ్యానించారు. గుడ్డ కాల్చి ముఖాన వేస్తే తుడుచుకునే…
  • జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర ట్వీట్.
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. మహాకవి గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన రచనను ఆ పోస్టులో షేర్ చేశారు. ఆ పోస్టులో.. ‘ ఏ రస్తా యుద్ధాలు చేస్తుందో..ప్రాణాల్ని ఆటబంతుల్లా…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Our Visitor

020056
Total views : 92158

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.