గ్రేటర్ విశాఖపై కూటమి జెండా పాతింది. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పదికి పది మంది సభ్యులనూ కూటమి పార్టీలే గెలుచుకున్నాయి. నిజానికి, నిన్న మొన్నటి వరకు గ్రేటర్ విశాఖలో వైసీపీకే బలం ఉంది. ఏపీలో కూటమి ప్రభుత్వం రావడంతో కార్పొరేటర్లు కూడా కూటమి బాట పట్టారు. ఆల్రడీ అధికారికంగానే 17 మంది వైసీపీ కార్పొరేట్లు టీడీపీ, జనసేనలో చేరారు. కూటమి పార్టీలు, వైసీపీ మధ్య గ్రేటర్ విశాఖ స్థాయీ సంఘం ఎన్నిక హోరాహోరీగా సాగింది. గ్రేటర్ విశాఖపై పూర్తి పట్టు సాధించేలా ముందు నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేసింది కూటమి. ఈ ఎన్నికను అటు కూటమిలోని టీడీపీ-జనసేన-బీజేపీ ఇటు వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో క్యాంపు రాజకీయాలు జోరుగా నడిచాయి. కార్పొరేటర్లు తమ కనుసన్నల నుంచి తప్పించుకోకుండా ఇరువర్గాల వాళ్లు కాపు కాశారు. 97 మంది కార్పొరేటర్లలో 96 మంది ఓటింగ్లో పాల్గొనేలా చేశారు. కాని, ఓట్లు మాత్రం అల్టిమేట్గా కూటమి సభ్యులకే పడ్డాయి.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- జోహార్ కామ్రేడ్ … సీతారాం ఏచూరిఒక మనిషి 72 ఏళ్ళు బతికితే 50 ఏళ్ళు ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుని ఒకే పార్టీలో పనిచేయడం మాటలా? అదీ పొద్దు తిరుగుడు పూల వనాన్ని మరిపించే నేటి రాజకీయాలలో ఊసర వెల్లుల మధ్య ఆలా బతకడం అంటే…
- కోచింగ్ సెంటర్లను కంట్రోల్లో పెడ్తంపోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లు, నీట్, ఎంసెట్లాంటి ప్రవేశ పరీక్షలకు శిక్షణనిచ్చే సంస్థలపై కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను రాష్ట్రంలో అమలు చేస్తామని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లు,…
- వయోవృదులందరికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమాదేశంలో ఉన్న 70 ఏళ్లు పైబడిన వయోవృదులందరికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమా పథకాన్ని వర్తింపజేయాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ది చేకూరుతుంది. వీరందరికీ…
- బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో మరో సంచలనంబెంగళూరు రేవ్ పార్టీ కేసులో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. తాజాగా నటి హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నారని, డ్రగ్స్ సేవించారని బెంగళూరు పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆమె ఎండీఎంఏ డ్రగ్ను తీసుకున్నట్లుగా ఆధారాలను సేకరించి అందుకు సంబంధించిన…
- అత్యుత్తమ దేశాల జాబితాలో టాప్ లో స్విట్జర్లాండ్ప్రపంచ దేశాలలో అత్యుత్తమ దేశంగా ‘స్విట్జర్లాండ్’ మరోసారి నిలిచింది. బెస్ట్ కంట్రీస్ ర్యాంకింగ్స్ లో వరుసగా మూడోసారి నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. అందమైన పర్యాటక ప్రాంతాలతో పాటు జీవన ప్రమాణం, నాణ్యత, సంస్కృతి తదితర అంశాల ఆధారంగా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి