289
అనంతపురం జిల్లా గుంతకల్ మండలం నక్కం దొడ్డి దగ్గర ద్విచక్ర వాహనం అదుపుతప్పడంతో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఇద్దరిలో ఒకరిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వ్యక్తి గుత్తి దగ్గర ధర్మాపురంకు చెందిన వాడని అతని పేరు వినోద్ (26 సంవత్సరాలు)గా గుర్తించారు. వీరు కసాపురం కి వస్తుండగా నక్కం దొడ్డి దగ్గర బైక్ అదుపుతప్పి కిందపడడం తో వినోద్ అక్కడిక్కకడే మృతి చెందాడు.





Total views : 79587