కడప జిల్లా.. కడప వైసిపి పార్లమెంటు అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు వైయస్ అవినాష్ రెడ్డి (YS Avinash Reddy). కలెక్టర్ విజయరామరాజుకు నామినేషన్ పత్రాలను అందజేశారు. కడప మేయర్ సురేష్ బాబు, పులివెందుల మార్కెట్ యార్డ్ చైర్మన్ చిన్నప్ప, మైనార్టీ నాయకులతో కలిసి కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను ఆయన దాఖలు చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
అనంతరం అవినాష్ రెడ్డి మాట్లాడుతూ… ఈ ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో అభివృద్ధితోపాటు సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిదే అన్నారు. కడప సమీపంలోని కొప్పర్తి ని పారిశ్రామిక హబ్ గా తయారు చెస్తూ… సుమారు 30 వేల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించినట్లు ఆయన తెలిపారు. రాబోవు రోజుల్లో సుమారు లక్ష మంది నిరుద్యోగులకు కొప్పర్తిలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. స్టిల్ ప్లాంట్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని… మొదటి దశ పనులు 2026 కు పూర్తవుతాయని ఆయన స్పష్టం చేశారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- భారీ వర్షాలకు పెరుగుతోన్న గోదావరి ఉధృతిగోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడంతో క్షణక్షణానికీ ప్రవాహం పెరుగుతోంది. ఏపీలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నీటి మట్టం 14.20 అడుగులకు చేరింది. దీంతో అధికారులు అన్ని గేట్లు ఎత్తి 13.27…
- శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి సురేష్ గోపితిరుమల శ్రీవారిని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి సురేష్ గోపి దర్శించుకున్నారు. బుధవారం ఉదయం అర్చన సేవలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేయగా.. ఆలయ…
- తొమ్మిదోరోజు విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబుప్రజల కోసం తాను జీవితాంతం పని చేస్తానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తొమ్మిదోరోజు విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులకు అందుతున్న సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులకు అండగా ఉంటానని హామీ…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి