కృష్ణాజిల్లా, గుడివాడ నియోజకవర్గం.. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వెనిగండ్ల రాము (Venigandla Ramu) ఈరోజు మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం రాము తన ఇంటి వద్ద నుండి భారీ ర్యాలీగా బయలుదేరి నెహ్రూ చౌక్, మార్కెట్ సెంటర్ , ఏజీకి స్కూల్ మీదగా ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. ఈ ర్యాలీలో వెనిగండ్ల రాముతో పాటు మచిలీపట్నం జనసేన పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వల్లభనేని బాలసౌరి, మాజీ పార్లమెంటు సభ్యులు కొనకల్ల నారాయణ, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. నామినేషన్ వేసిన అనంతరం రాము మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే కొడాలి నాని గుడివాడను అభివృద్ధిలో 20 సంవత్సరాలు వెనక్కి తీసుకువెళ్లాడని, తాను గెలుపొందితే గుడివాడను 25 సంవత్సరాల అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. మట్టి మాఫియాగా నాని దోచుకున్నాడని, క్యాసినో, పేకాటలాంటి అసాంఘిక కార్యకలాపాలతో గుడివాడ నాశనం చేశాడని అన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కీలక కార్యక్రమాలకు నడ్డా…
- ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్న్యూస్.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రెండు డీఏలను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన డీఏలను సెప్టెంబరు నెల జీతంతో కలిపి చెల్లించాలని ఆదేశించింది. 2025 జనవరి 1 నుంచి 1.82 శాతం…
- ఏపీకి భారీ వర్షసూచన.. 9 జిల్లాలకు అలర్ట్.ఏపీలో వాతావరణశాఖ భారీ వర్షాలపై హెచ్చరికలు జారీ చేసింది. రెండు రోజులపాటు తొమ్మిది జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. విశాఖ, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో…