కడప జిల్లా.. కడప వైసిపి పార్లమెంటు అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు వైయస్ అవినాష్ రెడ్డి (YS Avinash Reddy). కలెక్టర్ విజయరామరాజుకు నామినేషన్ పత్రాలను అందజేశారు. కడప మేయర్ సురేష్ బాబు, పులివెందుల మార్కెట్ యార్డ్ చైర్మన్ చిన్నప్ప, మైనార్టీ నాయకులతో కలిసి కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను ఆయన దాఖలు చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
అనంతరం అవినాష్ రెడ్డి మాట్లాడుతూ… ఈ ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో అభివృద్ధితోపాటు సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిదే అన్నారు. కడప సమీపంలోని కొప్పర్తి ని పారిశ్రామిక హబ్ గా తయారు చెస్తూ… సుమారు 30 వేల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించినట్లు ఆయన తెలిపారు. రాబోవు రోజుల్లో సుమారు లక్ష మంది నిరుద్యోగులకు కొప్పర్తిలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. స్టిల్ ప్లాంట్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని… మొదటి దశ పనులు 2026 కు పూర్తవుతాయని ఆయన స్పష్టం చేశారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
- జనసేన అధినేత పవన్కల్యాణ్ సంచలన నిర్ణయం.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
- గుంటూరు జిల్లా తాడేపల్లిలో 92 ఎకరాల భూ వివాదం.కోట్ల రూపాయల విలువైన భూములను కాజేసేందుకు భారీ కుట్ర జరిగిందంటూ గుంటూరు జిల్లా తాడేపల్లిలో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సోదరుడు రామకృష్ణ తమకు భారీ మొత్తంలో డబ్బులు, అపార్ట్మెంట్లలో ప్లాట్లు ఇస్తామని హామీ ఇచ్చి…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి






Total views : 90623