శ్రీ సత్య సాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం సోమందేపల్లి కస్తూర్బా హాస్టల్ లో ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి సవిత . విద్యార్థినులు తమ సమస్యలపై మంత్రికి నేరుగా లేఖ రాయడంతో మంత్రి స్వయంగా వచ్చి విద్యార్థులతో ముచ్చడించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
సమస్యలపై విద్యార్థినిలు వ్యక్తిగతంగా మంత్రి సవిత తో మాట్లాడారు. ముఖ్యంగా హాస్టల్ ఇంచార్జ్ ఎస్ఓ శాలిని దేవి తమతో డబ్బులు వసూలు చేస్తున్నారని, అర్ధరాత్రి సమయంలో ఇంచార్జ్ ఎస్ ఓ హాస్టల్ నుండి బయటికి వెళ్లడం రావడం తమకు భయమేస్తుందని, అని తెలియజేశారు. మంత్రి హాస్టల్ లోని వంటగది నీ పరిశీలించి అక్కడ కుళ్ళిపోయిన కాయగూరలను చూసి హాస్టల్ వార్డెన్ తో మీ ఇంటికి కూడా ఇలాంటి కాయగూరలతో భోజనాలు చేస్తారంటూ ఆగ్రహాన్నివెలిబుచ్చారు . బాత్రూమ్స్ లో పరిశీలించి శుభ్రంగా లేకపోవడంతో హాస్టల్ వార్డెన్ పై మండిపడ్డారు. హాస్టల్ వార్డెన్ శాలిని దేవి వ్యవహార శైలిపై , ఆమెపై వచ్చిన ఆరోపణలతో వెంటనే శాలిని దేవి పై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- జోహార్ కామ్రేడ్ … సీతారాం ఏచూరిఒక మనిషి 72 ఏళ్ళు బతికితే 50 ఏళ్ళు ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుని ఒకే పార్టీలో పనిచేయడం మాటలా? అదీ పొద్దు తిరుగుడు పూల వనాన్ని మరిపించే నేటి రాజకీయాలలో ఊసర వెల్లుల మధ్య ఆలా బతకడం అంటే…
- కోచింగ్ సెంటర్లను కంట్రోల్లో పెడ్తంపోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లు, నీట్, ఎంసెట్లాంటి ప్రవేశ పరీక్షలకు శిక్షణనిచ్చే సంస్థలపై కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను రాష్ట్రంలో అమలు చేస్తామని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లు,…
- వయోవృదులందరికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమాదేశంలో ఉన్న 70 ఏళ్లు పైబడిన వయోవృదులందరికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమా పథకాన్ని వర్తింపజేయాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ది చేకూరుతుంది. వీరందరికీ…
- బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో మరో సంచలనంబెంగళూరు రేవ్ పార్టీ కేసులో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. తాజాగా నటి హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నారని, డ్రగ్స్ సేవించారని బెంగళూరు పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆమె ఎండీఎంఏ డ్రగ్ను తీసుకున్నట్లుగా ఆధారాలను సేకరించి అందుకు సంబంధించిన…
- అత్యుత్తమ దేశాల జాబితాలో టాప్ లో స్విట్జర్లాండ్ప్రపంచ దేశాలలో అత్యుత్తమ దేశంగా ‘స్విట్జర్లాండ్’ మరోసారి నిలిచింది. బెస్ట్ కంట్రీస్ ర్యాంకింగ్స్ లో వరుసగా మూడోసారి నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. అందమైన పర్యాటక ప్రాంతాలతో పాటు జీవన ప్రమాణం, నాణ్యత, సంస్కృతి తదితర అంశాల ఆధారంగా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి