రెండు వేర్వేరు సంఘటనల్లో 6 గురు స్మగ్లర్లను అరెస్టు చేసి, 18 ఎర్రచందనం దుంగలు, ఒక కారు స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్సు డీఎస్పీ మురళీధర్ తెలిపారు. ఆయన మీడియా తో మాట్లాడుతూ కర్నూలు రేంజి డీఐజీ సెంథిల్ కుమార్ ఉత్తర్వుల మేరకు టాస్క్ ఫోర్సు ఎస్పీ శ్రీనివాస్ ఆదేశాలతో గురువారం సాయంత్రం కల్యాణి డ్యాం నుంచి చీకటీగలకోన మీదుగా శ్రీవారిమెట్టు వైపు కూంబింగ్ చేపట్టారు. అర్ధరాత్రి సమయంలో భాకరాపేట రేంజ్ నాగపట్ల ఈస్ట్ ఫారెస్టు బీటు పరిధిలో కొంతమంది వ్యక్తులు ఎర్రచందనం దుంగలను మోసుకుని వెళుతూ కనిపించారు. వారిని టాస్క్ ఫోర్సు టీం చుట్టుముట్టగా వారు రాళ్లు, కొడవళ్లతో దాడి చేసి పారిపోయే ప్రయత్నం చేశారు. అయితే వారిలో తమిళనాడు తిరువన్నామలై జిల్లా జమునామత్తూరుకు చెందిన మణిను పట్టుకున్నారు. స్మగ్లర్లు పడేసిన 11 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. మరో సంఘటనలో రైల్వే కోడూరు టాస్క్ ఫోర్సు ఆర్ఎస్ఐ ఆలీబాషా టీమ్ నాయుడుపేట వైపు ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు తనిఖీ చేసుకుని వెళుతూ, గూడూరు-నాయుడుపేట హైవే రోడ్డు మీద బూధానం టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. శుక్రవారం ఉదయం ఒక కారులోని వ్యక్తులు వాహనం వదిలి పారిపోయే ప్రయత్నం చేశారు. దీంతో టాస్క్ ఫోర్సు టీమ్ వారిని చుట్టుముట్టి కారులో తనిఖీలు చేయగా అందులో 7ఎర్రచందనం దుంగలు కనిపించాయి. వాటిని కారుతో పాటు స్వాధీనం చేసుకుని ఐదుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. ఈ రెండు కేసుల్లోని దుంగలు విలువ సుమారు రూ.20 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఈ ఆపరేషన్ లో పాల్గొన్న సిబ్బందికి రివార్డును అధికారులు ప్రకటించారు.
తిరుపతిలో ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు…
82
previous post