రాజమండ్రిలో రెండో రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన..

రాజమండ్రిలో రెండో రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన

Advertisements

<p>రాజమండ్రిలో రెండో రోజు పర్యటిస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్&period; గోదావరి కాలుష్యాన్ని పరిశీలించేందుకు మరోసారి బోటుపై ప్రయాణించారు&period; గోదావరిలో ఆంధ్ర పేపర్ మిల్స్ కాలుష్య వ్యర్ధాలు కలిసే ప్రాంతానికి వెళ్లిన పవన్‌ కల్యాణ్‌&period;&period;పేపర్ మిల్ కాలుష్య వ్యర్ధాల శాంపిల్స్ తీయించారు&period; ఆంధ్ర పేపర్ మిల్స్ కాలుష్య నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించారు&period; ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం&period; గోదావరిలో కాలుష్య వ్యర్ధాలు కలవడం దారుణమని&period;&period;పుష్కరాలకు ఈ నీళ్లలో స్నానం చేస్తే పుణ్యం కాదు రోగాలు వస్తాయన్నారు&period; పరిశ్రమల నుంచి వస్తున్న కాలుష్యంపై కేబినెట్‌&comma; అసెంబ్లీలో చర్చిస్తామన్న పవన్‌ కల్యాణ్&period;&period;పర్యావరణాన్ని కాపాడమంటే పరిశ్రమలు ఎందుకు ఆగిపోతాయని ప్రశ్నించారు&period; ఉపాధితో పాటు పర్యావరణం కూడా ముఖ్యం కాదా అన్నారు&period; ఇక తనిఖీల సందర్భంగా &period;&period;గోదావరి నది కాలుష్యం జరగకుండా చూడాల్సిన బాధ్యత మీది కాదా అంటూ మంత్రి కందుల దుర్గేష్‌&comma; అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..