యాదవ సంఘం ఆధ్వర్యంలో పెద్ద పట్నం మరియు అగ్నిగుండాలు…

Big Patnam and Agnigunda under the Yadava community

Advertisements

&NewLine;<p>కొమురవెల్లి మల్లికార్జున స్వామికి పట్నం భక్తులు పబ్బతి పట్టారు మదినిండా మల్లన్న నామస్మరణతో డప్పు చప్పుల దరువు నడుమ శివశక్తుల శిగాలు పూనకాలు పోతురాజుల చిందులతో కొమురవెల్లి విజయాచాల గుట్టలు హోరెత్తాయి&period; మల్లన్న బ్రహ్మోత్సవాలలో భాగంగా సంక్రాంతి పర్వదినం తర్వాత వచ్చే మొదటి ఆదివారాన్ని పట్నం వారంగా పిలుస్తారు&period; నిన్నటి రోజు మొదటి ఆదివారం కావడంతో హైదరాబాద్కు చెందిన భక్తులు సుమారు లక్ష మంది వరకు తరలివచ్చారు&period; కొమురవెల్లి మొత్తం జనసంద్రంగా మారింది భక్తులు భక్తి ప్రవర్తలతో బోనాలు తయారు చేసి స్వామివారికి నైవేద్యాన్ని నివేదించారు&period; ఈరోజు యాదవ సంఘం ఆధ్వర్యంలో పెద్దపట్నం మరియు అగ్నిగుండాలు సంక్రాంతి పర్వదినం తర్వాత వచ్చే మొదటి ఆదివారం తదుపరి రోజు సోమవారం రోజున అనగా ఈరోజు హైదరాబాద్ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి నుంచే ఒగ్గు పూజారుల చేత పెద్ద పట్నం రచించి అలాగే అగ్నిగుండాల కార్యక్రమం ఏర్పాటు చేసి వచ్చిన భక్తులంతా ఒంటినిండా పసుపు ధరించి భక్తులు పట్నం తొక్కి అగ్నిగుండాలలో చిందేశారు&period; ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నుండి చాలామంది భక్తులు స్వామివారిని దర్శించుకుని పెద్ద పట్నం మరియు అగ్నిగుండాలు తొక్కి భక్తి పారవశ్యంలో మునిగి తేలారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.