ఒక మనిషి 72 ఏళ్ళు బతికితే 50 ఏళ్ళు ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుని ఒకే పార్టీలో పనిచేయడం మాటలా? అదీ పొద్దు తిరుగుడు పూల వనాన్ని మరిపించే నేటి రాజకీయాలలో ఊసర వెల్లుల మధ్య ఆలా బతకడం అంటే నమ్మలేని రోజులివి. కానీ నిన్న చనిపోయిన సీతారాం ఏచూరి నమ్మకాన్ని ఒక నిలువెత్తు నిజంగా మన కళ్ళ ముందు ఆవిష్కరించారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం చివరి శ్వాస వరకూ అలాగే బతికారు.
విప్లవమా! అది వస్తుందో రాదో తెలియని దశలో సోవియట్ రష్యా నుంచి భారత దేశానికీ చేరడానికి ఇంకా ఎంత దూరం ప్రయాణం చేయాలో తెలియని స్థితిలో ఏచూరి కామ్రేడ్ గా మారారు పైన స్వర్గం ఒక చెదిరిన కలలా మిగిలిపోయినా అసలు చైనాలో వున్నది సోషలిస్టు వ్యవస్తేనా అనే అనుమానం పీడిస్తున్నా కూడా ఎర్ర జెండాను వదలకుండా వున్న ఏచూరిని చూసి “పొద్దు తిరుగుడు పూలు” కూడా సిగ్గుపడి తల దించుకున్నాయి.
కళ్ళ ముందే బెంగాల్ లాంటి కమ్యూనిస్ట్ కంచుకోటలు కుప్పకూలినా, చట్ట సభల్లో కామ్రేడ్లు కనుమరుగవుతున్నా ఏచూరి దారి తప్పలేదు పక్క చూపులు చూడలేదు.
చదువు సంధ్యా లేకపోతె రాజకీయాలే గతి అని అందరం అనుకుంటాం. కానీ ఏచూరి ఇందుకు పూర్తిగా భిన్నమయిన వ్యక్తి. బతుకుదెరువు కోసం అయన రాజకీయాలలోకి రాలేదు. ఆలా బతకాలి అనుకుంటే ఏచూరి రాజకీయాలలోకి రావాల్సిన పనేలేదు. అందునా కమ్యూనిస్ట్ రాజకీయాలలోకి అసలే అవసరం లేదు. ఢిల్లీ లోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ లో ఎకనామిక్స్ లో సీట్ రావడం చాలామందికి ఒక కల. ఆది దాదాపు అసాధ్యమయిన పని. అక్కడ చదివి ఐఏఎస్ అధికారి కావడమో లేకపోతె ఎదో యూనివర్సిటీ లో ఒక ప్రొఫెస్సర్ కావడమో ఏమంత కష్టమయిన పని కాదు.
కమ్యూనిస్ట్ రాజకీయాలలో ఏచూరి ఒక సిద్ధాంతకర్త (ideologue), ఆంగ్లం, తెలుగు, హిందీ, తమిళం, బెంగాలీ భాషల్లో ప్రావిణ్యం వున్న బహుముఖ ప్రజ్ఞాశాలి. కాకపోతే అగ్నిహోత్రికుల కుటుంభం లో పుట్టి పెరిగిన ఏచూరి తన పార్టీ లో క్రీమీ లేయర్ గా, ఒక ఎలీట్ గా మిగిలిపోయారు. అందువల్ల తన టిపికల్ ఫార్మ్, ఆంగ్లిసైజెడ్ కంటెంట్ లను అధిగమించి గ్రామీణ నేపథ్యం గల మధ్యతరగతి, పేద వర్గాలకు చెందిన కింది స్థాయి కార్యకర్తలతో కనెక్ట్ కావడం తనకు సవాలుగా మారింది.
జాతీయ స్థాయిలో సంకీర్ణ ప్రభుత్వాల కూర్పులకే ఏచూరి ప్రధానంగా పరిమితం అయ్యారు. అధికార పార్టీల కూర్పులో ఏచూరి కనపర్చిన ఈజ్ మోడీ పాలనలో అర్బన్ నక్సల్స్ గా ముద్ర వేయబడి అణచివేతకు గురయిన prof సాయిబాబా, వరవర రావు లాటి వివిధ వామపక్ష పాయలకు చెందిన అనేకమందితో కలిసి పనిచేయడం లో కొరవడింది. అలాగే 20 వ శతాబ్ది లో వెల్లువలో వచ్చిన అస్తిత్వ ఉద్యమాలతో మమేకం కాలేకపోయారు. బహుశా తన సామజిక నేపథ్యం కూడా ఇందుకు అడ్డంకి అయివుండొచ్చు.
మార్క్సిస్ట్ సిద్ధాంతం ఒక డాగ్మా లాగా మిగిలిపోకుండా నిత్యం మారుతున్న కాలానికి అనుగుణంగా సంపన్నం చేయడానికి అవసరమయిన థింక్ ట్యాంక్ ను పదిల పర్చడం ఏచూరి వారసుల ముందు నేడున్న అతి పెద్ద సవాల్.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్కి థాంక్స్..‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్కి థాంక్స్.. యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్లో హీరో సూరి మంచి విజయాన్ని ఇచ్చిన ఆడియెన్స్కి థాంక్స్.. ‘మండాడి’ యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్లో హీరో సుహాస్ ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్…
- నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కీలక కార్యక్రమాలకు నడ్డా…
- మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.బ్రిక్స్ ఇండియా 2026 సదస్సు నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మధ్య కీలక ద్వైపాక్షిక భేటీ జరిగింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో భారత్–మలేషియా సంబంధాలకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.…
- ఏడేళ్ల తరువాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ భారత్ పర్యటనకు రానున్నారు. గాల్వాన్ వ్యాలీ ఘటన తర్వాత తొలిసారిగా భారత్కు వస్తున్న జిన్పింగ్ పర్యటనపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకోనున్న జిన్పింగ్తో పాటు…
- ప్యారడైజ్ నా కెరీర్లోనే ఎక్కువ కష్టపడి చేసిన సినిమా.ప్యారడైజ్ నా కెరీర్లోనే ఎక్కువ కష్టపడి చేసిన సినిమా. సెప్టెంబర్ 24న వస్తున్నాం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అడ్రినలిన్ పంపింగ్ హై ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సినిమా అంతా హైలెట్గా ఉంటుంది: ప్రెస్ మీట్లో న్యాచురల్ స్టార్ నాని న్యాచురల్ స్టార్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి