హైదరాబాద్ : అమీర్‌పేట్ గర్ల్స్ హాస్టల్‌పై దాడి కేసు సంచలనం..

హైదరాబాద్ : అమీర్‌పేట్ గర్ల్స్ హాస్టల్‌పై దాడి కేసు సంచలనం

Advertisements

<p>అమీర్‌పేట్‌లో గర్ల్స్ హాస్టల్‌పై జరిగిన దాడి ఘటన హైదరాబాద్‌లో సంచలనంగా మారింది&period; దాదాపు 30 మంది వ్యక్తులు హాస్టల్‌లోకి చొరబడి విద్యార్థినులను భయభ్రాంతులకు గురి చేశారని ఏషియన్ పీజీ ఫర్ గర్ల్స్ హాస్టల్” నిర్వాహకుడు పంజాగుట్ట పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేశాడు&period; కోర్టు &OpenCurlyDoubleQuote;యథాతథ స్థితి” ఉత్తర్వులు అమల్లో ఉన్నప్పటికీ… రాజకీయ పలుకుబడితో ఒత్తిళ్లు తెచ్చి హాస్టల్ ఖాళీ చేయించేందుకు ప్రయత్నించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు&period;ఈ మేరకు మాజీ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి సహా భవన యజమానులపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కావడం ఈ వ్యవహారం మరింత హీటెక్కింది&period; సిబ్బందిపై దాడులు&comma; మొబైల్ ఫోన్ల స్వాధీనం&comma; వీడియోలు డిలీట్ చేయడం వంటి ఆరోపణలు కేసును మరింత సీరియస్‌గా మార్చాయి&period; ముఖ్యంగా అమ్మాయిల హాస్టల్‌లోకి దుండగులు ప్రవేశించారన్న అంశం మహిళల భద్రతను లేవనెత్తుతోంది&period; సివిల్ వివాదం పేరుతో ప్రైవేట్ సేనలను రంగంలోకి దింపుతున్నారా&period;&period;&quest; రాజకీయ ప్రభావంతో చట్టాన్ని పక్కన పెట్టే ప్రయత్నమా&period;&period;&quest; అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పంజాగుట్ట సిఐ రామకృష్ణ వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సింగరేణి కార్మికుల హక్కుల సాధనలో గుర్తింపు సంఘం విఫలం: హెచ్‌ఎంఎస్.

రాఖీ పౌర్ణమికి 5 వేల ప్రత్యేక ఆర్టీసీ బస్సులు.

మైన్స్ అండ్ జియాలజీ అధికారిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.