అమర్‌నాథ్ హిమలింగ దర్శన యాత్ర ప్రారంభం.

అమర్‌నాథ్ హిమలింగ దర్శన యాత్ర ప్రారంభం

Advertisements

<p>హిమాలయాల్లో వెలిసిన పవిత్ర అమర్‌నాథ్ హిమలింగ దర్శన యాత్ర ప్రారంభమైంది&period; క్షేత్ర దర్శనానికి బాల్తాల్ రూట్‌ లో వెళ్తున్న భక్తుల తొలి బృందానికి జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఉన్న చందర్‌కోట్ వద్ద ఘన స్వాగతం లభించింది&period; రాంబన్ జిల్లా యంత్రాంగం&comma; సివిల్ సొసైటీ సభ్యులు&comma; వివిధ సంస్థలు భక్తులకు ఆత్మీయ ఆతిథ్యంతో స్వాగతం పలికాయి&period; అంతకుముందు&comma; జమ్మూలోని భగవతీ నగర్ బేస్ క్యాంప్ నుంచి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈ వార్షిక యాత్ర కాన్వాయ్‌ను జెండా ఊపి ప్రారంభించారు&period; భక్తులను స్వాగతించిన వారిలో డీఐజీ సర్గూన్ శుక్లా&comma; రాంబన్ డిప్యూటీ కమిషనర్ మహమ్మద్ అలియాస్ ఖాన్&comma; ఎస్ఎస్పీ అరుణ్ గుప్తా&comma; ట్రాఫిక్ ఎస్ఎస్పీ రాజా ఆదిల్ హమీద్ సహా పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు&period; తర్వాత&comma; భక్తులు బస చేసే మొదటి ప్రధాన కేంద్రం చందర్‌కోట్&period; పవిత్ర యాత్ర సాఫీగా&comma; సురక్షితంగా సాగేందుకు జిల్లా యంత్రాంగం అన్ని రకాల చర్యలు చేపట్టింది&period; చందర్‌కోట్ లంగర్ సైట్ వద్ద భక్తులకు అవసరమైన వసతులు&comma; భోజన సదుపాయాలను సిద్ధం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.